Webdunia - Bharat's app for daily news and videos

Install App

శుభాలు కలిగించే వైవిధ్యమైన అభిషేకాలు!

Webdunia
సాధారణంగా ఆలయాల్లో పాలు, తేనె, కొబ్బరి నీళ్లు, పెరుగు, పసుపు నీళ్లు, పంచామృతాలు... ఇలా వివిధ రకాల పానీయాలతో ఉత్సవ మూర్తులకు అభిషేకాలు నిర్వహిస్తుంటారు. అయితే వీటితో కాకుండా తవుడుతో అభిషేకం చేయడం ఎక్కడన్నా విన్నారా? చూశారా?

ఈ అభిషేకం చూడాలంటే కేరళలోని కొడుంగనల్లూరులో ఉన్న భగవతీ అమ్మవారి ఆలయాన్ని సందర్శించాల్సిందే. ఈ ఆలయంలో అమ్మవారికి తవుడుతో అభిషేకం చేస్తారట. చాలా ఆశ్చర్యకరంగా ఉంది కదూ. తవుడుతో అభిషేకం చేయడం ద్వారా అమ్మవారు ఎప్పుడూ శాంతంగా ఉండి భక్తుల కోర్కెలు తీరుస్తుందని భక్తుల నమ్మకం.

అంతే కాదు, కుట్రాలంలో ఉన్న కుట్రాలనాథునికి వివిధ రకాల మూలికలు, వేర్ల మిశ్రమంతో తయారైన తైలంతో అభిషేకం నిర్వహిస్తారట. మూలికలు కలిసి ఉండటంతో మంచి ఔషధంగా పనిచేస్తుందని, దీనిని భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేస్తారట.

అలాగే చెన్నైలోని క్రోమ్‌పేట్‌లో ఉన్న చెంగచేరీ అమ్మవారికి పౌర్ణమి రోజుల్లో గోరింటాకు ఆకులతో అభిషేకం నిర్వహిస్తారట. తర్వాత ఈ ఆకులను కన్యలకు ప్రసాదంగా పంచి పెడతారట. తద్వారా వారికి త్వరలోనే వివాహం జరుగుతుందని భక్తుల నమ్మకం.
అన్నీ చూడండి

తాజా వార్తలు

India: 25 వైమానిక మార్గాలను నిరవధికంగా మూసివేసిన భారత్

రాగల 48 గంటల్లో పాకిస్తాన్ ముక్కలవుతుందా? పాక్ లోని బెలూచిస్తాన్ స్వతంత్ర దేశమవుతుందా?

పాకిస్తాన్ ప్రజల్లో యుద్ధ భయం: డబ్బు కోసం ATMల ముందు బారులు

Operation sindhoor కి ప్రతీకారంగా ఎల్‌ఓసీ వద్ద పాక్ కాల్పులు: 16 మంది మృతి, 150 మందికి పైగా గాయాలు

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసు: మళ్లీ చిక్కుల్లో సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి

అన్నీ చూడండి

లేటెస్ట్

04-05-2025 ఆదివారం దినఫలితాలు - రుణ విముక్తులవుతారు...

04-05-2025 నుంచి 10-05-2025 వరకు ఫలితాలు - శ్రమిస్తేనే కార్యం నెరవేరుతుంది...

Jupiter Transit 2025: మే 14వ తేదీన గురు పరివర్తనం- కన్యారాశికి 75 శాతం సంతోషం-80 శాతం ఆదాయం

TTD: యాత్రికుల కోసం వాట్సాప్ ఆధారిత ఫీడ్‌బ్యాక్ వ్యవస్థ..టీటీడీ

03-05-2025 శనివారం దినఫలితాలు - వ్యూహాత్మకంగా అడుగులేస్తారు...

Show comments