Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాలు తొక్కితే వ్యాధి మాయం అవుతుందా....?

Webdunia
శుక్రవారం, 8 ఆగస్టు 2008 (20:14 IST)
WD
అంతరిక్షంలో అద్భుతాలు సృష్టిస్తున్న నేటి కాలంలోనూ అమాయక జనం మూఢనమ్మకాలతో బాబాలను ఆశ్రయిస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో ఓ వ్యక్తి బాబా అవతారమెత్తి కాళ్ల నొప్పుల నుంచి క్యాన్సర్ వ్యాధి దాకా ఎటువంటి భయంకర వ్యాధినైనా మాయం చేస్తానని నమ్మబలుకుతున్నాడు.

బాబా అవతారానికి ముందు డబ్బాల ఖాసింగా పిలువబడిన ఇతగాడు అనంతపురం జిల్లాలోని పాలమూరుజిల్లాలోని గేదెలు ఎద్దు కొమ్ముల వ్యాపారం చేస్తుండేవాడు. దీంతో అతనికి చుట్టుప్రక్కల చాలామంది ప్రజలు పరిచయమయ్యారు. ఒకరోజు ఉన్నట్లుండి తనను ఈశ్వరుడు ఆవహించాడనీ, రోగులకు వ్యాధులను నయం చేయమని చెప్పాడని ప్రకటించాడు.

అంతే అప్పటి నుంచి అతని వద్దకు రోగం నయం చేయమని జనాలు రావడం మొదలుపెట్టారు. దీంతో అతను గోపాల్‌పేట్ మండలంలో తిష్ట వేశాడు. తొలుత ఉచిత చికిత్స చేస్తానన్న ఈ బాబా ఆ తర్వాత క్రమంగా డబ్బులు వసూలు చేయడం మొదలుపెట్టాడు.

చెంబులోని నీళ్లను రోగి నోట్లో పోయడం, తల మీద గట్టిగా కొట్టడం, కాలు తొక్కడంతో అతను చేసే వైద్యం పూర్తవుతుంది. దీంతో ప్రజలు నిమ్మకాయలు, నీళ్ల బాటిళ్లతో బాబా చికిత్సకోసం బారులుతీరి ఉంటున్నారు. చివరికి 108 వాహనంలోని రోగులు కూడా బాబా వద్దకు వస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ప్రజలు చైతన్యవంతులు కానంతవరకూ ఖాసింలాంటి బాబాలు పుట్టుకొస్తునే వుంటారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అవసరమైతే ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేద్దాం.. ఎంపీగా నేను పోటీచేస్తా.. పోయేదేముంది?: జగన్

Chandra Babu New Idea: పట్టణాల్లో పశువుల కోసం హాస్టళ్లు.. చంద్రబాబు

Kavitha: తండ్రి పార్టీ నుండి సస్పెండ్ చేసిన ఏకైక కుమార్తెను నేనే: కల్వకుంట్ల కవిత

Chandrababu: వ్యర్థాల పన్నుతో పాటు వ్యర్థ రాజకీయ నాయకులను తొలిగిస్తాను.. చంద్రబాబు

ఐఐటీలో మరో మృతి- ఉరేసుకుని పీహెచ్‌డీ విద్యార్థి ఆత్మహత్య

అన్నీ చూడండి

లేటెస్ట్

20-09-2025 శనివారం ఫలితాలు - వ్యతిరేకులు సన్నిహితులవుతారు...

రాహుకేతువులు ప్రసన్నత కోసం జపించాల్సిన శ్లోకాలు

100 ఏళ్ల తర్వాత సూర్య గ్రహణంతో కలిసి వస్తున్న పితృపక్షం, ఏం చేయాలి?

సెప్టెంబర్‌ 21న సూర్యగ్రహణం: కన్యారాశిలో సూర్యుడు, చంద్రుడు, బుధుడు...

Mahalaya Amavasya 2025: రవి అమావాస్య, మహాలయ అమావాస్య.. రెండూ ఒకే రోజు..

Show comments