Webdunia - Bharat's app for daily news and videos

Install App

2024 ఐపీఎల్‌లో ధోనీ ఆడుతాడా? ఆ పోస్ట్ అర్థమేంటి?

సెల్వి
మంగళవారం, 5 మార్చి 2024 (05:31 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో ఎంఎస్ ధోనీ ఆడతాడని అందరూ భావించారు. 2023లోనే రిటైర్మెంట్ వుంటుందని అంచనా వేశారు. కానీ ధోనీ నుంచి ప్రకటన వెలువడలేదు. గత సీజన్‌లో ధోనీ నాయకత్వంలో చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ గెలుచుకుని విజేతగా నిలిచింది. ఆపై ధోనీ మోకాలి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. 
 
ఇటీవలే అతడి ప్రాక్టీసుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీంతో 2024 సీజన్‌లో ఆడటం ఖాయమని అంతా భావించారు. ఈ నేపథ్యంలో ఫేస్‌బుక్ వేదికగా టీమిండియా మాజీ స్టార్ ధోనీ ఆసక్తికర పోస్ట్ చేశాడు. 
 
కొత్త సీజన్, కొత్త పాత్ర కోసం వేచిచూడలేకపోతున్నాను. వేచి వుండండి.. అంటూ ఎఫ్‌బీలో ధోనీ పెట్టిన పోస్టు అతడి రిటైర్మెంట్‌పై ఊహాగానాలకు దారితీసింది. 
 
ధోనీ చెన్నై జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తాడా.. లేదా ఇంకేదైనా పాత్ర పోషిస్తాడా అనే చర్చ మొదలైంది. కోచ్, మెంటార్‌గా ధోనీ బాధ్యతలు చేపడతాడని ఫ్యాన్స్ అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హరిద్వార్ మానసాదేవి ఆలయంలో తొక్కిసలాట.. భక్తుల మృతి

బెంగుళూరు తొక్కిసలాట : మృతదేహంపై బంగారు ఆభరణాలు చోరీ

కొండాపూర్‌లో రేవ్ పార్టీ... 50 ఓజీ కుష్ గంజాయి వినియోగం...

ఢిల్లీలో పాఠశాల బాత్రూమ్‌లో బాలుడిపై లైంగిక దాడి

మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు ఘన నివాళులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

తర్వాతి కథనం
Show comments