ఐపీఎల్ 2019.. వేలంలో యువీకి షాక్.. తొలి రౌండ్లోనే హనుమ విహారికి చోటు

Webdunia
మంగళవారం, 18 డిశెంబరు 2018 (18:08 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2019 కోసం ఆటగాళ్ల ఎంపిక వేలం ద్వారా జరుగుతోంది. వేసవి కానుకగా ప్రారంభమయ్యే ఐపీఎల్ పోటీల్లో భాగంగా ఆయా ఫ్రాంచైజీలు వేలం పాటలో క్రికెటర్లను కొనేందుకు సిద్ధమయ్యాయి. జైపూర్ వేదికగా ఐపీఎల్-2019 సీజన్ వేలం పాట జరుగుతోంది. ఈ టోర్నీలోని ఎనిమిది ఫ్రాంచైజీలు కలిసి మొత్తం 70 మంది ఆటగాళ్లను కొనుగోలు చేయనున్నారు. 
 
ఇందుకోసం 351 మంది క్రికెటర్లు పోటీపడుతున్నారు. ఈ వేలంలో భాగంగా ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ కి మొదటి రౌండ్ లో ఫ్రాంఛైజీలు షాకిచ్చాయి. మొదటి రౌండ్ లో యూవీని కొనుగోలు చేసేందుకు ఒక్క ఫ్రాంఛైజీ కూడా ఆసక్తి చూపించలేదు. యూవీతోపాటు మనోజ్ తివారి, పుజారా, మార్టిన్ గప్తిల్, బ్రెండన్ మెక్‌కలమ్, అలెక్స్ హేల్స్(ఇంగ్లాండ్)లపై ఫ్రాంఛైజీలు ఆసక్తి కనబర్చలేదు. 
 
ఇకపోతే.. ఈ వేలం పాటలో ఆంధ్రా క్రికెటర్ హనుమ విహారిని తొలి రౌండ్లోనే ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ రూ.2కోట్లకు హనుమ విహారిని దక్కించుకుంది. రూ.50లక్షలతో వేలంలో పాల్గొన్న ఆల్‌రౌండర్ కోసం ముంబయి ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ పోటీపడగా ఆఖరికి రూ.2కోట్లకు విహారిని ఢిల్లీ దక్కించుకుంది

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శాతవాహన ఎక్స్‌ప్రెస్ స్టాపేజీపై ద.మ.రైల్వే కీలక నిర్ణయం

తీరం దాటిన తుఫాను : ఏపీలో కుండపోతవర్షాలు ... పునరావాస కేంద్రాల్లో 75 వేల మంది

అంతర్వేదిపాలెంలో తీరాన్ని తాకిన మొంథా తుఫాను

Montha Effect: ఈ టైంలో బీచుల దగ్గర వీడియోస్ చేసుకోవడం కరెక్ట్ కాదు.. నారా లోకేష్

చంద్రబాబు గ్రేట్.. హరీష్ రావు తండ్రి పట్ల సంతాపం.. మొంథా పనులు ఒకవైపు జరుగుతున్నా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Down down CM: డౌన్ డౌన్ సి.ఎం. అంటూ రేవంత్ రెడ్డి సమావేశం వద్ద నిరసన సెగ

Revanth Reddy: కర్ణుడులా మిత్ర ధర్మాన్ని పాటిస్తా, సినీ కార్మికుల వెల్ఫేర్ కోసం పది కోట్లు ఇస్తా : రేవంత్ రెడ్డి

నేను కంటి నిండా నిద్రపోయి చాలా నెలలైంది.. మీరు అలాచేయకండి.. రష్మిక

ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ థ్రిల్లర్ గా కర్మణ్యే వాధికారస్తే చిత్రం

Rajinikanth: రజనీకాంత్ కు అదే ఆఖరి సినిమానా, రిటైర్ మెంట్ కారణమా?

తర్వాతి కథనం
Show comments