Webdunia - Bharat's app for daily news and videos

Install App

జట్టు కోసం మ్యాచ్‌లు గెలిపించివాడే ఫినిషర్: ధోనీపై గంభీర్ ప్రశంస

మ్యాచ్‌లు గెలపించడంలో మహేంద్రసింగ్ ధోనీ ఎంత గొప్ప ఫినిషరో అందరికీ తెలుసు. చివరి 3 ఓవర్లలో 45 పరుగులు బాది ప్రత్యర్థికి చుక్కలు చూపించిన ధోనీ ఐపీఎల్ 10 సీజన్‌లో మరుపురాని ఇన్నింగ్స్ ఆడి జట్టును ఒంటిచేత్తో గెలిపించిన తీరు యావత్ క్రికెట్ ప్రేక్షకులను ని

Webdunia
బుధవారం, 26 ఏప్రియల్ 2017 (02:27 IST)
మ్యాచ్‌లు గెలపించడంలో మహేంద్రసింగ్ ధోనీ ఎంత గొప్ప ఫినిషరో అందరికీ తెలుసు. చివరి 3 ఓవర్లలో 45 పరుగులు బాది ప్రత్యర్థికి చుక్కలు చూపించిన ధోనీ ఐపీఎల్ 10 సీజన్‌లో మరుపురాని ఇన్నింగ్స్ ఆడి జట్టును ఒంటిచేత్తో గెలిపించిన తీరు యావత్ క్రికెట్ ప్రేక్షకులను నివ్వెరపర్చింది. పుణె జట్టు యాజమాన్యం అయితే ఇలాంటి ఆడగాడిని అవమానించింది అంటూ విచారం వ్యక్తం చేసింది. అడవిలో సింహం ఎవరో తెలిసింది అంటూ పుణే జ్టటు కెప్టెన్ స్మిత్‌కు ధోనీకి మధ్య పోటీ పెట్టి ఈసడించిన జట్టు యజమాని తమ్ముడికి నోటి మాటపడిపోయింది.
 
అలాంటి ధోనీని చాన్నాళ్లుగా వ్యతిరేకిస్తున్న కొల్‌కతా జట్టు కెప్టెన్ గౌతమ్ గంభీర్ పరోక్షంగా ధోనీ ప్రతిభా పాటవాల గురించి వ్యాఖ్యానించాడు.  ‘నా దృష్టిలో ఫినిషర్‌ అని స్టార్టర్‌ అని ఎవరూ ఉండరు. ఆఖరి పరుగు తీసినవాడే ఫినిషర్‌. అతను ఓపెనర్‌ కావచ్చు లేదా 11వ నంబర్‌ ఆటగాడు కావచ్చు. ఆటగాడు ఎలా ఆడాడన్నదే ముఖ్యం. తన జట్టు కోసం మ్యాచ్‌లు గెలిపించివాడే ఫినిషర్‌’ అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు. అదే టోన్‌తో గంభీర్ తక్కువ పరుగులు చేసి డీలాపడిన తన జట్టును బుజ్జగించడం కాకుండా రెండో ఇన్నింగ్స్‌లో ఏమాత్రం ఉదాసీనత కనబర్చినా ఇదే మీ చివరి మ్యాచ్ అని హెచ్చరించడం ద్వారా గంభీర్ బెంగళూరు జట్టును చిత్తుగా ఓడించడానికి స్ఫూర్తిని కలిగించాడు. 
 
తొలి ఇన్నింగ్స్‌లో మా బ్యాటింగ్‌ను చూశాక తీవ్ర నిరాశ కలిగింది. అనంతరం ప్రత్యర్థి బ్యాటింగ్‌ సమయంలో జట్టు సభ్యుల నుం చి నేను దూకుడు ఆశించాను. వారు గట్టిగా పోరాడాలని, గెలిపించాలని కోరుకున్నాను. ఎవరైనా కాస్త ఉదాసీనత కనబర్చినా కోల్‌కతా తరఫున వారికి ఇదే ఆఖరి మ్యాచ్‌ అని చెప్పాను. నేను కెప్టెన్‌గా ఉన్నంత వరకైతే వారు మళ్లీ ఆడలేరని హెచ్చరించాను’ అని గంభీర్‌ ఆదివారం మ్యాచ్‌ను గుర్తు చేసుకున్నాడు. గెలుపు అందుకునే ప్రయత్నంలో మైదానంలో ఆగ్రహావేశాలు ప్రదర్శించేందుకు తాను వెనుకాడనని... ఈ క్రమంలో ఫెయిర్‌ప్లే అవార్డు పాయింట్లు కోల్పోయినా తాను లెక్క చేయనని అతను వ్యాఖ్యానించాడు. తన జట్టు పాయింట్ల పట్టికలో ముందంజలో నిలవడమే తనకు ముఖ్యమని గంభీర్‌ తేల్చి చెప్పాడు.
 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments