Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేక పుట్టించి రేసులో నిలిచిన కోల్‌కతా - ముంబై చిత్తు

Webdunia
శుక్రవారం, 24 సెప్టెంబరు 2021 (08:19 IST)
ఐపీఎల్ 14 సీజన్ రెండో దశ పోటీలు దుబాయ్ వేదికగా జరుగుతున్నాయి. ఈ పోటీల్లో భాగంగా, గురువారం డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌కు మరోమారు చుక్కెదురైంది. తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ చేతిలో ఓడిపోయింది. దీనికి కారణం కెప్టెన్ రోహిత్ శర్మ లేకపోవడమేననే కామెంట్స్ వినిపించాయి. అయితే, గురువారం రాత్రి కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ముంబై జట్టు ఓడిపోవడానికి కెప్టెన్ రోహిత్ శర్మే కారణం కావడం గమనార్హం. ఫలితంగా ముంబై జట్టు దారుణ పరాభవాన్ని ఎదుర్కొంది. ఐపీఎల్ రేస్‌లో నిలబడాలంటే గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో కేకేఆర్ జట్టు సభ్యులు సమిష్టిగా రాణించి వీరవిహారం చేశారు. ఫలితంగా కేకేఆర్ తన ప్రత్యర్థి ముంబై జట్టును చిత్తు చేసింది. 
 
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన ముంబై తొలి బంతి నుంచే దూకుడుగా ఆడింది. కెప్టెన్ రోహిత్ శర్మ, డికాక్ బంతులను బౌండరీలకు తరలిస్తూ స్కోరును పరుగులు పెట్టించారు. రోహిత్ 30 బంతుల్లో 4 ఫోర్లతో 33, డికాక్ 42 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 55 పరుగులు చేశారు. వీరి దూకుడుకు స్కోరు 200 పరుగులు దాటుతుందని భావించారు. 
 
అయితే, వీరిద్దరూ అవుటయ్యాక స్కోరు వేగం ఒక్కసారిగా మందగించింది. బ్యాటర్లు వరుసపెట్టి పెవిలియన్‌కు క్యూకట్టారు. సూర్యకుమార్ యాదవ్ (5), ఇషాన్ కిషన్ (14), కృనాల్ పాండ్యా (12) దారుణంగా నిరాశ పరిచారు. పొలార్డ్ మాత్రం 15 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్‌తో 21 పరుగులు చేసి జట్టు ఆ మాత్రం స్కోరైనా చేయడంలో సాయపడ్డాడు. మొత్తంగా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. కోల్‌కతా బౌలర్లలో ప్రసీద్ కృష్ణ, ఫెర్గ్యూసన్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా, సునీల్ నరైన్ ఓ వికెట్ తీసుకున్నాడు.
 
అనంతరం ముంబై నిర్దేశించిన 156 పరుగుల విజయ లక్ష్యాన్ని 15.1 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. శుభ్‌మన్ గిల్ 13 పరుగులకే వెనుదిరిగినా, వెంకటేశ్ అయ్యర్, రాహుల్ త్రిపాఠీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. వెంకటేశ్ 30 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 53 పరుగులు చేయగా, రాహుల్ త్రిపాఠీ 42 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 74 పరుగులతో అజేయంగా నిలిచాడు. 
 
కెప్టెన్ మోర్గాన్ 7, నితీశ్ రానా 5 (నాటౌట్) పరుగులు చేశారు. రాహుల్ త్రిపాఠీ విధ్వంసానికితోడు వెంకటేశ్ అయ్యర్ చెలరేగడంతో కోల్‌కతా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సత్తా చాటింది. కోల్‌కతా కోల్పోయిన మూడు వికెట్లూ బుమ్రాకే దక్కాయి. సునీల్ నరైన్‌కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ విజయంతో కోల్‌కతా పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకగా, ముంబై ఆరో స్థానానికి పడిపోయింది. శుక్రవారం షార్జాలో బెంగళూరు-చెన్నై మధ్య ఐపీఎల్ 35వ మ్యాచ్ జరగనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ టీడీపీ చీఫ్‌గా నందమూరి సుహాసిని.. చంద్రబాబు ప్లాన్ ఏంటి..?

చెప్పపెట్టకుండా బయటకు ఎందుకు వెళ్లారే దొంగముండల్లారా... లేడీ ప్రిన్సిపాల్ బూతులు (Video)

నోబెల్ శాంతి బహుమతి కోసం ఇమ్రాన్ ఖాన్ పేరు నామినేట్!

దంతెవాడలో ఎన్‌కౌంటర్ - శాఖమూరి అప్పారావు భార్య మృతి!

అనకాపల్లి-అచ్యుతాపురం మధ్య 4 లైన్ల రోడ్డు రాబోతోంది: నారా లోకేష్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వివాదాల నడుమ "ఎల్2 ఎంపురాన్" కలెక్షన్ల వర్షం : 4 రోజుల్లో రూ.200 కోట్లు

ఇంజనీర్ ఓ అమ్మాయి ప్రేమలో పడితే ఏమయిందంటే... ప్రదీప్ మాచిరాజు

Kalyan Ram: అమ్మల కోసం త్యాగం చేయాలి, అందుకే ఈ సినిమాని అమ్మలకు అంకితం : కళ్యాణ్ రామ్

పెళ్ళికి సిద్ధమవుతున్న చెన్నై చంద్రం?

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

తర్వాతి కథనం
Show comments