Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీకి కెప్టెన్‌గా పంత్.. ఐపీఎల్ హక్కులు యప్‌టీవీకే

Webdunia
మంగళవారం, 6 ఏప్రియల్ 2021 (19:38 IST)
ఐపీఎల్‌ 14వ సీజన్‌లో శ్రేయాస్‌ అయ్యర్‌ గైర్హాజరీలో ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రిషబ్‌ పంత్‌ ఎప్పుడెప్పుడు బరిలోకి దిగాలని ఎదురుచూస్తున్నాడు. అసలే దూకుడుకు మారుపేరుగా నిలిచిన పంత్‌కు ఇప్పుడు కెప్టెన్సీ బాధ్యతలు అదనంగా వచ్చి చేరాయి. 
 
కాగా ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ తన తొలి మ్యాచ్‌ను ఏప్రిల్‌ 10న చెన్నై వేదికగా సీఎస్‌కేతో ఆడనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రాక్టీస్ అనంతరం రిషబ్‌ పంత్‌ ఇంటర్య్వూలో ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. తాను కప్పు గెలిచినా, గెలవకున్నా మంచి కెప్టెన్ గా మాత్రం పేరుతెచ్చుకుంటానని చెప్పాడు. 
 
ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 ఈ నెల 9న ప్రారంభం కానుంది. ఐపీఎల్ డిజిటల్ బ్రాడ్‌కాస్టింగ్ హక్కులను యప్ టీవీ సొంతం చేసుకుంది. 
 
ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న యప్‌టీవీ సబ్‌స్క్రైబర్లు ఐపీఎల్ మ్యాచ్‌ల లైవ్‌ మ్యాచ్‌లను వీక్షించగలుగుతారు. అలాగే, దాదాపు వంద దేశాల్లో ఉన్న క్రికెట్ ఫ్యాన్స్‌కు మ్యాచ్‌లను వీక్షించే అవకాశం దక్కింది.

సంబంధిత వార్తలు

చిన్నారి చేతి వేలికి ఆపరేషన్ చేయమంటే.. నాలుకకు చేసిన వైద్యుడు... ఎక్కడ?

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

టీడీపికి ఓటేశామన్నందుకు తలలు పగులగొట్టారు, ఎక్కడ?

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

తర్వాతి కథనం
Show comments