Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్‌లో కలకలం : రాజస్థాన్ ఫీల్డింగ్ కోచ్‌కు కరోనా పాజిటివ్ (Video)

Webdunia
బుధవారం, 12 ఆగస్టు 2020 (14:44 IST)
కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కలకలం చెలరేగింది. ఐపీఎల్ ప్రాంఛైజీల్లో ఒకటైన రాజస్థాన్ రాయల్స్ జట్టుకు చెందిన ఫీల్డింగ్ కోచ్‌కు కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. ఈ జట్టు ఫీల్డింగ్ కోచ్‌గా దిశాంత్ యాగ్నిక్ కొనసాగుతున్నారు. ఈయనకు జరిపిన వైద్య పరీక్షల్లో పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన్ను 14 రోజుల క్వారంటైన్‌కు తరలించారు. యాగ్నిక్‌తో కలిసి పనిచేసిన అందరూ కరోనా టెస్టులు చేయించుకుని ఐసోలేషన్‌లో ఉండాలని రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం కోరింది.
 
మరోవైపు, దేశంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. ప్రతి రోజూ వేలాది సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. అయినప్పటికీ ఐపీఎల్ పోటీలు నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధమైంది. దీంతో వచ్చే నెల 19వ తేదీ నుంచి నవంబరు 10వ తేదీ వరకు ఈ పోటీలు దుబాయ్ వేదికగా జరుగనున్నాయి. నిజానికి ఈ పోటీలు నిర్వహించేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. అలా పర్మిషన్ ఇచ్చిన 48 గంటల్లోనే ఐపీఎల్ ప్రాంఛైజీ జట్లలో కరోనా కలకలం రేగడం గమనార్హం. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఢిల్లీ ఎన్నికలు: ఎగ్జిట్ పోల్స్ ఏమంటున్నాయి...? బీజేపీదే హవా-ఆప్‌కే గెలుపంటున్న కేకే సర్వే!

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆరోగ్య సమస్య ఏంటి?

హైదరాబాదులో దారుణం - సెల్లార్ గోడ కూలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బలి (video)

ఏపీ ఉద్యోగులు ఇక తెలంగాణ ఆస్పత్రుల్లోనూ వైద్యం పొందవచ్చు..

Receptionist: మహిళా రిసెప్షనిస్ట్‌ తప్పించుకుంది.. కానీ ఎముకలు విరిగిపోయాయా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జూనియర్ ఎన్. టి. ఆర్. కు అవమానం జరిగిందా !

యాక్టర్ గా తండేల్ దారి చూపిస్తుంధీ, కోస్ట్ గార్డ్ అరెస్ట్ చేసారు :అక్కినేని నాగచైతన్య

నా పక్కన నాన్న, మామ ఇలా మగవాళ్లు పడుకుంటే భయం: నటి స్నిగ్ధ

Grammys 2025: వెస్ట్ అండ్ బియాంకా సెన్సోరిని అరెస్ట్ చేయాలి.. దుస్తులు లేక అలా నిలబడితే ఎలా?

సౌత్ లో యాక్ట్రెస్ కు భద్రతా లేదంటున్న నటీమణులు

తర్వాతి కథనం
Show comments