Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ -11: సన్‌రైజర్స్‌దే అగ్రస్థానం.. రైనా, ఆండ్రూల రికార్డ్ అదుర్స్

వేసవిలో క్రికెట్ అభిమానుల్లో జోష్ నింపుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదకొండో దశ (ఐపీఎల్ 2018) పోటీలు ప్రస్తుతం కీలక ఘట్టానికి చేరుకున్నాయి. ఈ సీజన్లో ఇప్పటివరకూ 11 మ్యాచ్‌‌లు ఆడిన సన్‌‌రైజర్స్‌… 9 విజయ

Webdunia
శనివారం, 12 మే 2018 (16:36 IST)
వేసవిలో క్రికెట్ అభిమానుల్లో జోష్ నింపుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదకొండో దశ (ఐపీఎల్ 2018) పోటీలు ప్రస్తుతం కీలక ఘట్టానికి చేరుకున్నాయి. ఈ సీజన్లో ఇప్పటివరకూ 11 మ్యాచ్‌‌లు ఆడిన సన్‌‌రైజర్స్‌… 9 విజయాలతో పాయింట్ల పట్టికలో (18 పాయింట్లతో) టాప్‌ ప్లేస్‌‌ను ఆక్రమించింది. ప్లే ఆఫ్‌ బెర్తును దాదాపు ఖాయం చేసుకుంది. ఆ తర్వాత స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 11 మ్యాచ్‌లు ఆడి 7 మ్యాచ్‌లలో విజయం సాధించి 14 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.
  
అయితే, ఐపీఎల్ కప్‌ను రెండుసార్లు ఎగరేసుకున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పాయింట్లు, రన్‌రేట్ పరంగా కూడా రెండో స్థానంలో ఉంది. దీంతో ఈ రెండు జట్లు ప్లేఆఫ్‌కు అర్హత సాధించగా, మిగిలిన రెండు స్థానాలకు పంజాబ్, ముంబై, కోల్‌కతా, రాజస్థాన్ జట్లు పోటీపడుతున్నాయి. ఐపీఎల్ పట్టికలో అగ్రస్థానంలో సన్ రైజర్స్, రెండో స్థానంలో చెన్నై, మూడో స్థానంలో పంజాబ్, ముంబై, కోల్‌కతా, రాజస్థాన్ జట్లు వరుసగా టాప్-6లో స్థానం సంపాదించుకున్నాయి. 
 
ఇకపోతే.. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో చెన‍్నై సూపర్‌ సింగ్స్‌ ఆటగాడు సురేశ్‌ రైనా అరుదైన మైలురాయిని సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్‌ చరిత్రలో ప్రతీ సీజన్‌లో మూడొందలకు పైగా పరుగులు సాధించిన తొలి క్రికెటర్‌గా రైనా రికార్డు సాధించాడు. శుక్రవారం (మే 11) రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌ ద్వారా రైనా ఈ ఫీట్‌ నమోదు చేశాడు.
 
సీఎస్‌కే ఇన్నింగ్స్‌లో భాగంగా 10 ఓవర్‌ రెండో బంతికి రైనా ఈ సీజన్‌లో మూడొందల పరుగుల మార్కును చేరాడు. ఫలితంగా ప్రతీ ఐపీఎల్‌ సీజన్‌లో మూడొందలకు పైగా పరుగులు సాధించిన ఏకైక క్రికెటర్‌గా రైనా గుర్తింపు సాధించాడు. మరోవైపు గడిచిన ఐపీఎల్‌-10 సీజన్‌లలో రైనా టాప్‌-10లో చోటు సంపాదించుకున్నాడు.

ఇక కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు చెందిన ఆండ్రూ టై అత్యధిక వికెట్లు పడగొట్టిన క్రికెటర్‌గా రికార్డు సాధించాడు. ఈ సీజన్లో ఆండ్రూ ఆడిన పది మ్యాచుల్లో 16 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.

సంబంధిత వార్తలు

ఆగస్టు 15లోగా రైతుల 2 లక్షల పంట రుణాల మాఫీ.. ఏర్పాట్లు ఆరంభం

41 రోజుల రాజశ్యామల సహస్ర చండీయాగంలో జగన్

పాఠ్యపుస్తకాల మందం తగ్గింది.. ఈసారి ఆ ఇబ్బంది వుండదు..

మే 17 నుంచి 19 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

తర్వాతి కథనం
Show comments