Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ 2018 : రాజస్థాన్‌పై ఢిల్లీ ఉత్కంఠ విజయం

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2018 టోర్నీలో భాగంగా, రాజస్థాన్ జట్టుపై ఢిల్లీ ఉత్కంఠ విజయం సాధించింది. ప్లే ఆఫ్‌ రేసులో నిలవాలంటే ఖచ్చితంగా నెగ్గాల్సిన మ్యాచ్‌లో అన్ని విభాగాల్లో రాణించి అద్భుతమైన విజయాన్ని స

Webdunia
గురువారం, 3 మే 2018 (10:05 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2018 టోర్నీలో భాగంగా, రాజస్థాన్ జట్టుపై ఢిల్లీ ఉత్కంఠ విజయం సాధించింది. ప్లే ఆఫ్‌ రేసులో నిలవాలంటే ఖచ్చితంగా నెగ్గాల్సిన మ్యాచ్‌లో అన్ని విభాగాల్లో రాణించి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. బుధవారం వర్షం రెండుసార్లు అంతరాయం కలిగించిన మ్యాచ్‌లో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో నాలుగు పరుగుల తేడాతో రాజస్థాన్‌ రాయల్స్‌ను ఓడించింది.
 
వర్షం కారణంగా 18 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ 17.1 ఓవర్లలో 6 వికెట్లకు 196 పరుగులు చేసింది. రిషభ్‌ పంత్‌ (29 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 69), శ్రేయాస్‌ అయ్యర్‌ (35 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 50), పృథ్వీ షా (25 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 47) మెరుపు ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకున్నారు. 
 
అయితే, ఢిల్లీ ఇన్నింగ్స్‌ మరో 5 బంతుల్లో ముగుస్తుందనగా వర్షం మరోసారి అంతరాయం కలిగించింది. దాంతో, ఢిల్లీ ఇన్నింగ్స్‌ ముగిసినట్టు ప్రకటించిన అంపైర్లు డక్‌వర్త్‌ పద్ధతి ప్రకారం రాజస్థాన్‌ లక్ష్యాన్ని 12 ఓవర్లలో 151 పరుగులుగా లెక్కగట్టారు. అనంతరం ఛేదనలో జోస్‌ బట్లర్‌ (26 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్లతో 67), డిఆర్సీ షార్ట్‌ (25 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 44) భారీ షాట్లతో చెలరేగినా.. రాజస్థాన్‌ 12 ఓవర్లలో ఐదు వికెట్లకు 146 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. కీలకమైన రెండు వికెట్లు తీయడంతో పాటు ఆఖరి ఓవర్లో అద్భుతంగా బౌలింగ్‌ చేసిన ట్రెంట్‌ బౌల్ట్‌ ఢిల్లీని గెలిపించాడు. రిషభ్‌ పంత్‌కు 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' అవార్డు దక్కింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్య స్నానం చేస్తుండగా న్యూడ్ వీడియో తీసిన భర్త.. డబ్బు కోసం బెదిరింపులు...

గాల్లో గెలిచిన గాలి నాకొడుకులు ఎమ్మెల్యేలుగా ఉన్నారు : ఆర్కే రోజా

ప్రియుడితో సుఖంగా జీవించు... భార్యను సాగనంపిన భర్త...

Future City: ఫ్యూచర్ సిటీ, అమరావతిని కలిపే హై-స్పీడ్ రైలు.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారటగా!

Hyderabad: తెలంగాణలో భారీ వర్షాలు- టెక్కీలు వర్క్-ఫ్రమ్-హోమ్ అనుసరించండి..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

గాలి కిరీటీరెడ్డి జూనియర్ చిత్రానికి మిగిలింది రెండు రోజులే

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

ZEE5 లో ఆడియెన్స్‌ను అల‌రిస్తూ దూసుకెళ్తోన్న భైర‌వం

తర్వాతి కథనం
Show comments