Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ 2018 : వరుస పరాజయాలకు చెక్ పెట్టిన ఢిల్లీ డేర్‌డెవిల్స్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2018 టోర్నీలో భాగంగా ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు వరుస పరాజయాలకు చెక్ పెట్టింది. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో శుక్రవారం రాత్రి కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్

Webdunia
శనివారం, 28 ఏప్రియల్ 2018 (10:42 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2018 టోర్నీలో భాగంగా ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు వరుస పరాజయాలకు చెక్ పెట్టింది. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో శుక్రవారం రాత్రి కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ విజయభేరీ మోగించింది.
 
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన డీడీ నిర్ణీత 20 ఓవర్లలో 219 పరుగులు చేసింది. ఆ తర్వాత 220 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 164 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 55 పరుగుల తేడాతో ఢిల్లీ జట్టు ఘన విజయం సాధించింది. 
 
ఢిల్లీ జట్టుకు ఎదురైన వరుస పరాజయాల నేపథ్యంలో ఆ జట్టు కెప్టెన్సీ నుంచి గౌతం గంభీర్ తప్పుకున్నాడు. దీంతో జట్టు నాయకత్వ పగ్గాలను యువ బ్యాట్స్‌మెన్ శ్రేయాన్ అయ్యర్‌కు అప్పగించారు. శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో అయ్యర్ బ్యాట్‌తో రెచ్చిపోయాడు. ఫలితంగా 93 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 

సంబంధిత వార్తలు

వివేకా హత్య కేసులో రూ.40 కోట్లు చేతులు మారాయ్ : షర్మిల ఆరోపణ

చంద్రబాబు హామీలు కేవలం సైకిల్‌ బెల్స్‌ మాత్రమే..జగన్

మే 13, జూన్ 4 తేదీలకు వేతనంతో కూడిన సెలవులు

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారంటూ వైఎస్ షర్మిలపై కేసు నమోదు!!

కొణిదెల పవన్ కళ్యాణ్.. అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టాడు... తమ్ముడికి చిరంజీవి మద్దతు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

తర్వాతి కథనం
Show comments