Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేటి నుంచి ఐపీఎల్ : ఉప్పల్ వేదికగా తొలి సమరం.. సన్‌రైజర్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ పదో అంచెకు రంగం సిద్ధమైంది. గతేడాది చాంపియన్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌-రన్నరప్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు తొలి పోరులో తలపడనున్నాయి. హైదరాబాద్‌, ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర

Webdunia
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ పదో అంచెకు రంగం సిద్ధమైంది. గతేడాది చాంపియన్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌-రన్నరప్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు తొలి పోరులో తలపడనున్నాయి. హైదరాబాద్‌, ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో బుధవారం రాత్రి జరిగే మ్యాచ్‌లో గెలిచి పదో సీజన్‌ను ఘనంగా ఆరంభించాలని ఇరు జట్లూ భావిస్తున్నాయి. 
 
సొంతగడ్డపై అనుకూలతలతో పాటు కీలక ఆటగాళ్లంతా అందుబాటులో ఉండటంతో సన్‌రైజర్స్‌ ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. జట్టును ముందుండి నడిపించే వార్నర్‌ హైదరాబాద్‌కు కొండంతబలం కాగా... యువరాజ్‌, ధవన్‌, కేన్‌ విలియమ్సన్‌, భువనేశ్వర్‌, ఆశీష్‌ నెహ్రా, క్రిస్‌ జోర్డాన్‌ వంటి ఆటగాళ్లతో దుర్భేద్యంగా కనిపిస్తోంది. 
 
అలాగే, లీగ్‌ మొదలవకముందే ఆటగాళ్ల గాయాలతో బెంగళూరు ఒత్తిడిలోకి వెళ్లింది. ఆస్ట్రేలియాతో సిరీస్‌లో గాయపడ్డ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ సగం టోర్నీకి దూరమయ్యాడు. ఓపెనర్‌ లోకేశ్‌ రాహుల్‌, మిచెల్‌ స్టార్క్‌ ఈ సీజన్‌ నుంచి తప్పుకోగా.. ఏబీ డివిల్లీర్స్‌ ఫిట్‌నెస్‌పై అనుమానాలు తొలగిపోలేదు. వెన్నునొప్పితో బాధపడుతున్న ఏబీ ఆరంభ మ్యాచ్‌కు అందుబాటులో ఉండడం లేదు. ఇదే పెద్దదెబ్బ అనుకుంటే.. హార్డ్‌ హిట్టర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ ఈ సీజన్‌ మొత్తానికి దూరమయ్యే అవకాశం కనిపిస్తోంది. బెంగళూరులో ప్రాక్టీస్‌ సందర్భంగా సర్ఫ్‌రాజ్‌ గాయపడ్డాడు. ఇప్పటికే కోహ్లీ జట్టుకు దూరామైన విషయం తెల్సిందే. 
 
మరోవైపు... మంగళవారం రాత్రి నగరంలో పలు చోట్ల భారీ వర్షం పడడం ఆందోళన కలిగిస్తోంది. ఉప్పల్‌లో మంగళవారం సాయంత్రం ఈదురు గాలులతో చిన్నపాటి వర్షం కురిసింది. దాంతో, పిచ్‌ మొత్తాన్ని కవర్లతో కప్పి ఉంచారు. వర్ష సూ చన లేకున్నా ఒక్కసారిగా నగరంలో భారీవర్షం కురియడంతో మ్యాచ్‌ నిర్వాహకులు గాబరా పడుతున్నారు. మ్యాచ్‌కు ముందు ఆరంభ వేడుకలు కూడా ఉంటాయి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Delhi Election Trends: బీజేపీ విజయం ఖాయం.. రాహుల్ గాంధీకి అభినందనలు - కేటీఆర్ సెటైర్లు (video)

కమ్మ రాజ్యంలో కడప రెడ్లు.. రామ్ గోపాల్ వర్మపై కేసు.. సీఐడీ నోటీసులు

అంతులేకుండా పోయిన ఆప్, కమలనాథులదే ఢిల్లీ పీఠం

27 సంవత్సరాల తర్వాత ఢిల్లీలో అధికారంలోకి బీజేపీ-ఫలించిన చంద్రబాబు ప్రచారం

ప్రధాన మంత్రి మోదీని కలిసిన ఏఎన్నార్ ఫ్యామిలీ.. బహుమతిగా కొండపల్లి బొమ్మ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్రిబాణధారి బార్భరిక్ మూవీ నుంచి సిద్ శ్రీరామ్ సాంగ్ రిలీజ్

రమేష్ బాబు ఎందరినో మోసం చేసాడు, సివిల్ కోర్టులో కేసు నడుస్తోంది : -ఫైనాన్సియర్స్ సదానంద్

చాలా కాలంగా మిస్ అయ్యాను, తండేల్ తో మళ్ళీ నాకు తిరిగివచ్చింది : అక్కినేని నాగచైతన్య

చిరంజీవి పేరు చెప్పడానికి కూడా ఇష్టపడని అల్లు అరవింద్

తర్వాతి కథనం
Show comments