Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్-10.. చివరి లీగ్ మ్యాచ్‌లో పోరాడి ఓడిన ఢిల్లీ-కోహ్లీ సేన గెలుపు

కాసుల వర్షం కురిపిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదో సీజన్లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పది పరుగుల తేడాతో ఢిల్లీపై గెలుపును నమోదు చేసుకుంది. ఆదివారం జరిగిన ఐపీఎల్-10 చివరి లీగ్ మ్యాచ్‌లో బెంగళూర

Webdunia
కాసుల వర్షం కురిపిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదో సీజన్లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పది పరుగుల తేడాతో ఢిల్లీపై గెలుపును నమోదు చేసుకుంది. ఆదివారం జరిగిన ఐపీఎల్-10 చివరి లీగ్ మ్యాచ్‌లో బెంగళూరు నిర్దేశించిన 162 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఢిల్లీ పోరాడి ఓడింది. 151 పరుగులు మాత్రమే సాధించింది.
 
ఢిల్లీ ఆటగాళ్లలో రిషభ్‌ పంత్‌ (34 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 45) రాణించాడు. శ్రేయాస్‌ అయ్యర్‌ (32), కరుణ్‌ నాయర్‌ (26) శుభారంభం చేసినా.. భారీ స్కోరు మాత్రం నమోదు కాలేదు. చివర్లో మహ్మద్‌ షమి (21) పోరాడినా ఫలితం దక్కలేదు. బెంగళూరు బౌలర్లలో హర్షల్‌ పటేల్‌, పవన్‌ నేగి మూడేసి వికెట్లు పడగొట్టగా.. ట్రేవిస్‌ హెడ్‌ రెండు వికెట్లు సంపాదించాడు. 
 
అంతకుముందు టాస్‌ నెగ్గి బ్యాటింగ్‌ ఎంచుకున్న బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 161 పరుగులు చేసింది. కోహ్లీ (45 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 58), క్రిస్‌ గేల్‌ (38 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 48) రాణించారు. ఢిల్లీ బౌలర్లలో ప్యాట్‌ కమిన్స్‌ రెండు, జహీర్‌, నదీమ్‌ చెరో వికెట్‌‌ను తమ ఖాతాలో వేసుకున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

30 రోజులకు మించి ఉంటున్నారా? అయితే తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోండి.. అమెరికా

మీరట్ హత్య కేసు : నిందితురాలికి ప్రత్యేక సదుపాయాలు!

ఒకే ఇంట్లో ఇద్దరు క్రికెటర్లు ఉండగా... ఇద్దరు మంత్రులు ఉంటే తప్పేంటి: కె.రాజగోపాల్ రెడ్డి (Video)

అనకాపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ఎనిమిది మంది మృతి

ఏడుకొండలను 5 కొండలుగా మార్చేందుకు కుట్ర : హోం మంత్రి అనిత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

తర్వాతి కథనం
Show comments