Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ ఫీవర్: ఎనిమిది జట్ల బలం-బలహీనత ఏంటో తెలుసుకుందాం..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ట్వంటీ-20 క్రికెట్ సిరీస్‌‍ పదో సీజన్‌లో భాగంగా తొలి మ్యాచ్‌కు హైదరాబాద్ వేదిక కానుంది. మే 21వ తేదీ వరకు జరిగే.. ఈ సిరీస్‌లో 8 జట్లు బరిలోకి దిగనున్నాయి. కోల్‌కతా నైట్ రైడర్స్ జ

Webdunia
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ట్వంటీ-20 క్రికెట్ సిరీస్‌‍ పదో సీజన్‌లో భాగంగా తొలి మ్యాచ్‌కు హైదరాబాద్ వేదిక కానుంది. మే 21వ తేదీ వరకు జరిగే.. ఈ సిరీస్‌లో 8 జట్లు బరిలోకి దిగనున్నాయి. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు గౌతం గంభీర్ నాయకత్వం వహిస్తున్నాడు. ఈ జట్టు టైటిల్ కోసం పాకులాడుతోంది. మెరుగైన ఆటతీరును ప్రదర్శించేందుకు.. రెడీ అవుతోంది. ఈ జట్టులో బ్రావో, యూసుఫ్ పఠాన్, మనీష్ పాండే, సూర్య కుమార్ యాదవ్, సునీల్ నరేన్, కుల్‌దీప్ వంటి మేటి క్రికెటర్లున్నారు. 
 
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు:
తాత్కాలిక కెప్టెన్ వాట్సన్ నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఈ ఏడాది ఐపీఎల్ ఓ ఛాలెంజ్ కానుంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ, రాహుల్, డివిలియర్స్ ఈ టోర్నీ నుంచి గాయాల పాలై.. ఐపీఎల్‌కు దూరమైన సంగతి తెలిసిందే. ఇదే జట్టుకు మైనస్. 
 
గుజరాత్ లయన్స్: 
సురేష్ రైనా నాయకత్వంలోని గుజరాత్ లయన్స్ గత ఐపీఎల్ పోటీల్లో మెరుగైన ఆటతీరును ప్రదర్శించింది. ఈ జట్టులో మెక్ కల్లమ్, అరోన్ పిచ్, దినేష్ కార్తీక్, జోసెఫ్ రాయ్ వంటి కుమ్మేసే బ్యాట్స్‌మెన్లు ఉన్నారు. అయితే ఆల్ రౌండర్లు జడేజా, బ్రావో రెండు వారాల పాటు ఆటకు దూరం కావడం ఈ జట్టుకు మైనస్. 
 
సన్ రైజర్స్ హైదరాబాద్ :
డిఫెండింగ్ ఛాంపియన్ అయిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ ట్రోఫీని ఈ ఏడాది కూడా కైవసం చేసుకునేందుకు మల్లగుల్లాలు పడుతోంది. కెప్టెన్ వార్నర్, యువరాజ్ సింగ్, శిఖర్ ధావన్, దీపక్ షీడా, రషీద్ ఖాన్, ఆప్ఘనిస్థాన్ క్రికెటర్ మొహ్మద్, ప్రవీణ్ వంటి అత్యుత్తమ ఆటగాళ్లు ఈ జట్టులో స్థానం సంపాదించుకున్నారు. కానీ నెహ్రా గాయాల నుంచి కోలుకుని జట్టుకు చేరుకునేంత వరకు జట్టుకు కాస్త కష్టాలు తప్పవు. 
 
ముంబై ఇండియన్స్:  
రోహిత్ శర్మ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ జట్టు మెరుగైన ఆటతీరును ప్రదర్శించేందుకు రెడీ అవుతోంది. రోహిత్ శర్మ, జోస్ బట్లర్, పోలార్డ్, హార్దిక్ పాండ్య, సిమ్మన్స్, అంబటి రాయుడు వంటి అత్యుత్తమ క్రీడాకారులు ఈ జట్టులో ఉన్నారు. బౌలింగ్ విభాగంలో హర్భజన్ సింగ్, బుమ్రాలు జట్టుకు ప్లస్‌గా నిలుస్తారు. 
 
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ : 
మాక్స్‌వెల్ నేతృత్వంలోని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు వృద్ధిమాన్ సాహా, మిల్లర్ వంటి ధీటుగా ఆడే క్రికెటర్లతో బరిలోకి దిగుతోంది. కానీ మురళీ విజయ్ గాయంతో మ్యాచ్‌లకు దూరం కావడం జట్టుకు మైనస్. 
 
ఢిల్లీ డేర్‌డెవిల్స్ : 
జహీర్ ఖాన్ నేతృత్వంలోని ఈ జట్టు తొలిసారిగా ఐపీఎల్ ట్రోఫీని సొంతం చేసుకోవాలని భావిస్తోంది. డుమిని, డికాక్ గాయాలతో తప్పుకున్నా.. అమిత్ మిశ్రా, ఆండర్సన్, కరుణ్ నాయర్, మాథ్యూస్ వంటి ఆటగాళ్లు ఈ జట్టుకు బలంగా ఉన్నారు. అయితే ఇప్పటికే జరిగిన తొమ్మిది ఐపీఎల్ సీజన్లలో ఆడిన ఢిల్లీ ఫైనల్‌కు చేరుకోలేదు. 
 
రైజింగ్ పూణే సూపర్ జెయింట్ : 
కెప్టెన్ పోస్టు నుంచి ధోనీని తప్పించి.. ఆ స్థానంలో ఆస్ట్రేలియా ఆటగాడు స్మిత్‌ను ఎంపిక చేశారు. రూ.14.5 కోట్ల మొత్తంతో వేలంలో కొనుగోలు చేసిన బెన్ స్టోకస్‌పై భారీ అంచనాలున్నాయి. రహానే డుప్లెసిస్ వంటి ఆటగాళ్లతో తప్పకుండా ఈ జట్టు తప్పకుండా మెరుగ్గా ఆడుతుందని క్రీడా పండితులు జోస్యం చెప్తున్నారు. తొలి మ్యాచ్‌లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్- సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు నువ్వా నేను అని పోటీ పడనున్నాయి.

మీడియాలో వాయిస్ లేనోళ్లంతా జగన్‌కే ఓటు, భారీ మెజారిటీ: రాజు రవితేజ

ట్రోల్స్ ధాటికి టెక్కీ ఆత్మహత్య.. ఏమైంది.. ఎక్కడ?

గుజరాత్‌లో నవ వధువును కిడ్నాప్ చేసిన సాయుధ దుండగులు!!

మహిళ కడుపులో 570 రాళ్లు: షాక్ అయిన డాక్టర్లు

తప్పు చేయనపుడు భయపడొద్దు.. స్వదేశానికి వచ్చెయ్.. ప్రజ్వల్‌కు వినతి

డల్లాస్‌లో థమన్. ఎస్ భారీ మ్యూజికల్ ఈవెంట్ బుకింగ్స్ ఓపెన్

బాలీవుడ్ సినిమాల కోసం తొందరపడట్లేదు.. నాగచైతన్య

థియేటర్లు బాగానే సంపాదించాయిగా... ఇప్పుడు మొత్తం పోయింది... గోవిందా!

సహచర నటి పవిత్ర ఎడబాటును భరించలేక నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య!!

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

తర్వాతి కథనం
Show comments