Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్పూన్‌ను మింగేసి కొద్దిరోజులు కడుపులోనే ఉంచుకుంది... తర్వాత ఏమైందంటే?

Webdunia
బుధవారం, 17 ఏప్రియల్ 2019 (17:04 IST)
ఓ మహిళ గొంతులో గుచ్చుకున్న చేప ముల్లును తీసుకునేందుకు ప్రయత్నిస్తుండుగా ఐదు అంగుళాల స్పూన్‌ను మింగేసి ఆసుపత్రిపాలైన ఘటన చైనాలో చోటుచేసుకుంది. స్పూన్ కడుపులోకి వెళ్లడం వల్ల కడుపు నొప్పితో ఆసుపత్రిలో చేరిన లిలీ అనే మహిళ‌కు ఎక్స్‌రే తీయగా కడుపులో 13 సెం.మీ (5 అంగుళాలు) పొడవైన స్పూన్ కనిపించింది.


ఆ మహిళ ఏప్రిల్ 5వ తేదీనే స్పూన్‌ను మింగేసినా చాలా రోజులు వరకు ఆసుపత్రిలో చేరలేదు. కడుపులో పెద్దగా సమస్య లేకపోవడం వల్ల దాన్ని అలాగే వదిలేసింది. ఈమధ్య కడుపులో కొంచెం నొప్పి రావడంతో షెంజెన్ ఆసుపత్రిలో వైద్యులను సంప్రదించింది. కడుపులో కనిపించిన స్సూన్‌ను ఎండోస్కోపీ ద్వారా తొలగించాలని వైద్యులు నిర్ణయించారు. 
 
ఈ సందర్భంగా ఆమెకు వైద్యం అందించిన డాక్టర్ సన్ తింగ్జీ మాట్లాడుతూ కడుపులో ఉన్న స్పూన్ అడ్డంగా ఇరుక్కుపోయిందని, దాన్ని నిలువుగా వచ్చేలా చేసి నెమ్మదిగా గొంతు నుంచి బయటకు తీశామని తెలియజేసారు. కేవలం 10 నిమిషాల్లోనే చికిత్స పూర్తి చేసినట్లు తెలియజేసారు. మెటల్ స్పూన్ కావడం వల్ల కడుపులోని చిన్న ప్రేగు ఆంత్రమూలంలో వాపు ఏర్పడిందని తెలిపారు. చికిత్స తర్వాత లిలీ వేగంగానే కోలుకోవడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు తెలియజేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments