Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండోనేషియాలో ఘోరకలి : మృతదేహాల గుట్టలు.. నేలకూలిన భవనాలు

Webdunia
ఆదివారం, 23 డిశెంబరు 2018 (15:07 IST)
ఇండోనేషియాలో ఘోరకలి సంభవించింది. సునామీ ప్రళయం సృష్టించింది. ఒక్కసారిగా సునామీ విరుచుకుపడటంతో ఏకంగా 168 మంది వరకు మృత్యువతాపడ్డారు. ఈ మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. అంతేనా, ఎటు చూసినా నేలకూలిన భవనాలు, గుట్టలు గుట్టులుగా మృతదేహాలు కనిపిస్తున్నాయి. అనేక మంది క్షతగాత్రులు రక్తమోడుతూ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. 
 
ఈ సునామీ సృష్టించిన విధ్వంసంతో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తీవ్ర సునామీ వల్ల చాలా మంది ప్రజలు శిథిలాల్లో చిక్కుకున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తించి వెలికితీసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. సహాయం కోసం అర్ధిర్థిస్తున్న వారిని ఆదుకునేందుకు నీరు, ఆహారాన్ని సరఫరా చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ విలయం కారణంగా 168 మందికి పైగా చనిపోయారని అధికారులు ప్రకటించారు.
 
వందల సంఖ్యలో భవనాలు దెబ్బతిన్నాయని.. నష్టం ఎంతనేది ఇప్పుడే అంచనా వేయలేమని విపత్తుల నిర్వాహణ సంస్థ ప్రతినిధి వెల్లడించారు. దక్షిణ సుమత్రా, పశ్చిమ జావాలో బీచ్‌ల్లో సునామీ సంభించిందని.. క్రాకటోవో దీవిలోని అగ్నిపర్వతం బద్ధలు కావడంతో ఈ విపత్తు వచ్చిందని తెలిపారు. లావా.. బూడిద 500 మీటర్ల ఎత్తు వరకు ఎగిసిపడిందని, సునామీకి గల ఖచ్చితమైన కారణాలు తెలుసుకొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments