Webdunia - Bharat's app for daily news and videos

Install App

న్యూజిలాండ్ రోడ్డు ప్రమాదంలో విశాఖ సంతోష్ మృతి.. వీకెండ్ సెలవులు..

Webdunia
సోమవారం, 26 జనవరి 2015 (11:41 IST)
న్యూజిలాండ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో విశాఖపట్నం నందగిరినగర్‌కు చెందిన చెరుకూరి సంతోష్ కుమార్ (26) మరణించాడు. సంతోష్ కుమార్ మరణవార్త అతని స్నేహితుల ద్వారా తల్లిదండ్రులకు చేరింది. రెండురోజుల్లో మృతదేహాన్ని విశాఖపట్నంకు పంపిస్తామని కంపెనీ ప్రతినిధులు, అక్కడి తెలుగు సంఘం హామీ ఇచ్చింది. రెండు రోజులు పూర్తైన కూడా మృతదేహం ఇంటికి చేరకపోవడంతో సంతోష్‌కుమార్ తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
 
జనవరి 22వ తేదీ సాయంత్రం జరిగిన ప్రమాదంలో రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి చెరుకూరి నూకరాజు, నాగలక్ష్మి దంపతుల పెద్ద కుమారుడు సంతోష్‌కుమార్ మరణించాడు. పీజీ చదవడానికి 2012లో న్యూజిలాండ్ వెళ్లాడు.
 
చదువు పూర్తి అయిన తర్వాత నాలుగు నెలల క్రితం అక్కడ ఓ ప్రైవేటు కంపెనీలో సేల్స్ మేనేజర్‌గా చేరాడు. తాను పనిచేస్తున్న కంపెనీ విధుల నిమిత్తం 22న న్యూజిలాండ్ సమీపంలోని టవరంగా అనే మరో ప్రాంతానికి వెళ్లాడు. పని ముగించుకొని కారులో తిరిగి వస్తుండగా కారును భారీ ట్రక్ ఢీకొనడంతో అక్కడిక్కడే మృతి చెందాడు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments