మోదీ బంగ్లా పర్యటన.. అల్లర్లు.. షేక్ హసీనాకు కష్టకాలం

Webdunia
మంగళవారం, 30 మార్చి 2021 (13:17 IST)
భారతదేశం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బంగ్లాదేశ్‌లో రెండు రోజుల పర్యటన సందర్భంగా అల్లర్లు సృష్టించడంలో జమాతే ఇస్లామీ హస్తముందని ఇంటెలిజెన్స్‌ నివేదికలు చెప్తున్నాయి. భారత్‌లోని మైనార్టీలైన ముస్లింల పట్ల నరేంద్ర మోదీ క్రూరంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపిస్తూ బంగ్లాదేశ్‌కు చెందిన ఉగ్రవాద సంస్థలు ప్రజలను ముఖ్యంగా యువతను ఆందోళన బాట పట్టించాయి.
 
మోదీ పర్యటనను అడ్డంగా పెట్టుకుని బంగ్లాదేశ్‌ ప్రధాని పీఠం పైనుంచి షేక్‌ హసీనాను దింపేయాలని అక్కడి ప్రతిపక్షాలు కుట్రపన్నాయి. ఈ సంగతులన్నీ ఇంటెలిజెన్స్‌ సంస్థ తన నివేదికలో వెల్లడించింది. 
 
బంగ్లాదేశ్‌లో మోదీ రెండు రోజుల పర్యటన సందర్భంగా అక్కడ ఆందోళనలు చోటుచేసుకోవడం, వారిని అదుపుచేసే ప్రయత్నంలో కాల్పులు జరుపడంతో 12 మంది పౌరులు మృత్యువాత పడ్డారు. పెద్ద సంఖ్యలో యువకులు జైలుపాలయ్యారు.
 
మోదీ పర్యటన సందర్భంగా చెలరేగిన హింస నిరసనల కారణంగా లేదని, దాని కోసం కుట్ర జరిగిందని గూఢచార సంస్థలు పేర్కొన్నాయి. నిషేధిత సంస్థ జమాతే ఈ ఇస్లామీ హస్తం దీని వెనుక ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు. బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చివేసే కుట్రలో భాగంగానే ఆందోళనలకు శ్రీకారం చుట్టినట్లు ఇంటెలిజెన్స్‌ నివేదికలు వెల్లడిస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bala Saraswati Devi : రావు బాలసరస్వతి గారు ఆత్మకు శాంతి చేకూరాలి: పవన్ కళ్యాణ్

Priyadarshi: ఏమీ చేయలేకపోతోన్నప్పుడు నెగెటివ్ కామెంట్లను చేస్తుంటారు : ప్రియదర్శి

గోపి గాళ్ల గోవా ట్రిప్.. కాన్సెప్ట్ చిత్రాలకు సపోర్ట్ చేయాలి : సాయి రాజేష్

Sudheer Babu: జటాధార తో సుధీర్ బాబు డాన్స్ లో ట్రెండ్ సెట్ చేస్తాడా...

Prabhas : రెబల్‌స్టార్ ప్రభాస్ సాలార్ రి రిలీజ్ కు సిద్దమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments