అక్రమ వలసదారులకు ట్రంప్ తాజా వార్నింగ్.. అక్రమంగా అడుగుపెట్టారో...

ఠాగూర్
మంగళవారం, 16 సెప్టెంబరు 2025 (13:59 IST)
తమ దేశంలో అక్రమంగా అడుగుపెట్టే వలసదారులకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ లేటెస్ట్ వార్నింగ్ ఇచ్చారు. తమ దేశంలోని అక్రమంగా ప్రవేశిస్త ఉగాండా, ఎస్వథిని, సౌత్ సూడాన్‌లలోని జైళ్లకు పంపిస్తామని ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. స్వదేశాలలో నేరాలు చేసి పారిపోయి తమ దేశంలోకి వస్తున్నారంటూ అక్రమ వలసదారులపై ఆయన మండిపడ్డారు. అమెరికాలోకి చ్చి మళ్లీ నేరాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. బైడెన్ సర్కారు అవలంభించిన కొన్ని విధానాల వల్ల నేరస్థులు అమెరికా గడ్డపై స్వేచ్చగా తిరుగుతున్నారని ఆయన పేర్కొన్నారు. 
 
ఇటీవల డల్లాస్‌లో భారత సంతతికి చెందిన నాగమల్లయ్య అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ హత్యపై ట్రంప్ స్పందిస్తూ, నాగమల్లయ్యను చంపిన హంతకుడు యోర్డానిస్ కోబోస్ మర్టినెజ్ క్యూబా పౌరుడని, అమెరికాలోకి అక్రమంగా వచ్చాడని తెలిపారు. తంలో చిన్న పిల్లలపై అఘాయిత్యం, వాహనాల దొంగతనం కేసులో మార్టినెజ్‌ను పోలీసులు జైలుకు పంపించారని గుర్తు చేశారు. అయితే, బైడెన్ ప్రభుత్వం అనుసరించిన విధానాల వల్ల ఆయన జైలు నుంచి విడుదలై నాగమల్లయ్యను హత్య చేశాడని తెలిపారు. చట్టాలను కఠినంగా అమలు చేసివుంటే మార్టినెజ్ బయటకు వచ్చేవాడు కాదని, ఇపుడు ఆయనను క్యూబాకు డిపోర్ట్ చేసే ప్రయత్నం చేసినా ఆ దేశం అంగీరించలేదన్నారు. అందుకే తమ ప్రభుత్వం ఇలాంటి నేరస్థులను అటు వారి స్వదేశానికి పంపకుండా ఇటు అమెరికాలో ఉండనివ్వకుండా మూడో దేశానికి పంపిస్తున్నామని తెలిపారు. ఇలాంటి నేరస్థులు ఉగాండా, ఎస్వతిని, సౌత్ సూడాన్ వంటి దేశాలకు పంపించి అక్కడి జైళ్లలో ఉంచుతామని తెలిపారు. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించే వారికి ఇదే తరహా శిక్షలను అమలు చేస్తామని డోనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలంకకు మానవతా సాయం... కాలం చెల్లిన ఆహారాన్ని పంపిన పాకిస్థాన్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments