Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో కొనసాగుతున్న కాల్పుల మోత - మరో ముగ్గురు హతం

Webdunia
బుధవారం, 25 జనవరి 2023 (10:33 IST)
అగ్రరాజ్యం అమెరికాలో కాల్పుల మోత మోగుతోంది. దుండగులు తుపాకీతో చెలరేగిపోతున్నారు. తాజాగా ఓ దండగుడు ముగ్గురిని కాల్చి చంపి తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన యకీమాలోని కన్వీనియన్స్‌ స్టోర్‌లో జరిగింది. ఆత్మహత్య చేసుకున్న నిందితుడి వయసు 21 యేళ్ళు. 
 
కాలిఫోర్నియాలోని హాఫ్ మూన్ బే పట్టణంలో రెండు రోజుల క్రితం ఓ వ్యవసాయ కార్మికుడు సహచరులపై జరిపిన కాల్పుల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. మృతులంతా చైనీయులే. అంతకుముందు మోంటెరీ పార్క్ నగరంలో చైనా న్యూ ఇయర్ వేడుకల్లో జరిగిన కాల్పుల్లో పది మంది చనిపోయారు. 
 
ఈ రెండు ఘటనలను మరచిపోకముందే వాషింగ్టంన్‌లోని యకీమా నగరంలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. నిందితుడు ముగ్గురిని కాల్చి చంపిన కొన్ని గంటల తర్వాత పోలీసులు చుట్టుముట్టడంతో తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సర్కిల్ కె. మార్కెట్‌లో తెల్లవారుజామున 3.30 గంటలకు ఈ ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు. నిందితుడిని యకీమా కౌంటీకి చెందిన 21 యేలఅల జారిడ్ హడాక్‌గా గుర్తించారు. కాగా, ఈ యేడాది ఇప్పటివరకు అమెరికాలో జరిగిన 39 కాల్పుల ఘటనలు జరిగినట్టు పోలీసులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రత్యేకమైన రోజుగా మార్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు : ఉపాసన

భర్తను పరిచయం చేసిన నటి అభినయ!!

కసికా కపూర్... చాలా కసి కసిగా వుంది: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి (video)

Prabhas: వ్యాపారవేత్త కుమార్తెతో ప్రభాస్ పెళ్లి.. ఎంతవరకు నిజం?

కథలకు, కొత్త టాలెంట్ ని కోసమే కథాసుధ గొప్ప వేదిక: కే రాఘవేంద్రరావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments