అమెరికాలో కొనసాగుతున్న కాల్పుల మోత - మరో ముగ్గురు హతం

Webdunia
బుధవారం, 25 జనవరి 2023 (10:33 IST)
అగ్రరాజ్యం అమెరికాలో కాల్పుల మోత మోగుతోంది. దుండగులు తుపాకీతో చెలరేగిపోతున్నారు. తాజాగా ఓ దండగుడు ముగ్గురిని కాల్చి చంపి తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన యకీమాలోని కన్వీనియన్స్‌ స్టోర్‌లో జరిగింది. ఆత్మహత్య చేసుకున్న నిందితుడి వయసు 21 యేళ్ళు. 
 
కాలిఫోర్నియాలోని హాఫ్ మూన్ బే పట్టణంలో రెండు రోజుల క్రితం ఓ వ్యవసాయ కార్మికుడు సహచరులపై జరిపిన కాల్పుల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. మృతులంతా చైనీయులే. అంతకుముందు మోంటెరీ పార్క్ నగరంలో చైనా న్యూ ఇయర్ వేడుకల్లో జరిగిన కాల్పుల్లో పది మంది చనిపోయారు. 
 
ఈ రెండు ఘటనలను మరచిపోకముందే వాషింగ్టంన్‌లోని యకీమా నగరంలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. నిందితుడు ముగ్గురిని కాల్చి చంపిన కొన్ని గంటల తర్వాత పోలీసులు చుట్టుముట్టడంతో తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సర్కిల్ కె. మార్కెట్‌లో తెల్లవారుజామున 3.30 గంటలకు ఈ ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు. నిందితుడిని యకీమా కౌంటీకి చెందిన 21 యేలఅల జారిడ్ హడాక్‌గా గుర్తించారు. కాగా, ఈ యేడాది ఇప్పటివరకు అమెరికాలో జరిగిన 39 కాల్పుల ఘటనలు జరిగినట్టు పోలీసులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments