Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాలిఫోర్నియాలో కవల పిల్లలతో పాటు దంపతుల మృతి.. ఏమైంది?

సెల్వి
బుధవారం, 14 ఫిబ్రవరి 2024 (21:30 IST)
అమెరికాలో భారతీయులపై దాడి ఒకవైపు.. మరణాలు మరోవైపు పెరిగిపోతున్నాయి. తాజాగా కాలిఫోర్నియాలో భారతీయ-అమెరికన్ కుటుంబం శవమై కనిపించింది. ఇందులో కవలపిల్లలు వుండటం దారుణం. 
 
వివరాల్లోకి వెళితే.. ఫిబ్రవరి 13న కాలిఫోర్నియాలోని శాన్ మాటియోలోని ఇద్దరు పిల్లలతో సహా నలుగురితో కూడిన భారతీయ-అమెరికన్ కుటుంబం శవమై కనిపించిందని పోలీసులు తెలిపారు.
 
 సాన్ మాటియో పోలీస్ డిపార్ట్‌మెంట్ బాధితుల్లో ఇద్దరు తుపాకీ గాయాలతో బాధపడ్డారని, మిగిలిన ఇద్దరి మరణానికి కారణం ఇంకా తెలియరాలేదని చెప్పారు. మృతులను ఆనంద్ సుజిత్ హెన్రీ (42), అతని భార్య ఆలిస్ ప్రియాంక (40), వారి కవల పిల్లలుగా గుర్తించారు. విషాదకరంగా, ఇద్దరు పిల్లలు పడకగదిలో చనిపోయారు. వారి మరణానికి కారణం ఇంకా విచారణలో ఉంది. 
 
బాత్‌రూమ్‌లో గన్‌షాట్‌ల కారణంగా దంపతులు మరణించారు. బాత్‌రూమ్‌లో 9 ఎంఎం పిస్టల్, లోడ్ చేసిన మ్యాగజైన్ కూడా కనుగొనబడ్డాయని శాన్ మాటియో పోలీసులు తెలిపారు. 
 
భారతీయ-అమెరికన్ దంపతులు ఐటీ నిపుణులు. ఆనంద్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేయగా, ఆలిస్ సీనియర్ అనలిస్ట్‌గా పనిచేశారు. ఆమె రెండేళ్ల క్రితం శాన్ మాటియో కౌంటీకి మారింది. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

కాలం రాసిన కథలు సినిమాకు సీక్వెల్ గా బ్యాచిలర్స్ ప్రేమకథలు ప్రారంభం

ఆర్టిస్టుల ముసుగు సస్పెన్స్ తోపాటు మిత్ర మండలి టైటిల్ ప్రకటించిన బన్నీవాస్

నార్నే నితిన్, సతీష్ వేగేశ్న కాంబోలో శ్రీ శ్రీ శ్రీ రాజావారు చిత్రం రివ్యూ

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments