కన్నబిడ్డ నవ్వు చికాకు పుట్టిస్తుందని పిడిగుద్దులు గుద్ది చంపేసిన కసాయి తండ్రి
కన్నబిడ్డ నవ్వు చికాకు పుట్టిస్తుందని పిడిగుద్దులు గుద్ది కన్నతండ్రే చంపేసిన ఘటన ఒకటి అమెరికాలోని మిన్నియాపొలిస్ నగరంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
కన్నబిడ్డ నవ్వు చికాకు పుట్టిస్తుందని పిడిగుద్దులు గుద్ది కన్నతండ్రే చంపేసిన ఘటన ఒకటి అమెరికాలోని మిన్నియాపొలిస్ నగరంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
కోరీ మొర్రీస్ (21) అనే వ్యక్తి తన భార్య ఉద్యోగానికి వెళ్లిన సమయంలో ఇంట్లో తమ నాలుగు నెలల కుమార్తె ఎమెర్సిన్ సంరక్షణ చూసుకునేవాడు. మొర్రీస్ భార్య ఇంట్లోలేని సమయంలో టీవీ చూస్తుండగా ఉయ్యాల్లో ఉన్న పసికందు తనలో తానే నవ్వుకుంటూ కేరింతలు కొడుతోంది. అది చూసి తండ్రిగా ఆనందించాల్సిందిపోయి టీవీ చూస్తుంటే చికాకు కలిగిస్తోందని ఆ చిట్టితల్లి ముఖం, గుండెలపై 22 సార్లు పిడిగుద్దులు గుద్దాడు.
ఆ పసికందు గుండెలపై చేతులతో గట్టిగా అదిమిపెట్టి చంపేశాడు. అనంతరం తన భార్యకు, తల్లికి ఫోన్ చేసి తాను తప్పు చేశానిని చెప్పి పెట్టేశాడు. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి తన బిడ్డను చంపేశానని చెప్పాడు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు మొర్రీస్ను అరెస్టు చేశారు.