Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాడెన్ కుమారుడి ఆచూకీ చెప్తే... మిలియన్ డాలర్లు...

Webdunia
శుక్రవారం, 1 మార్చి 2019 (11:50 IST)
ఒకవైపు ఉగ్రదాడులకు కేంద్రంగా ఉందని పేర్కొంటూ... భారత్ చేస్తున్న దాడులతో తలపట్టుకు కూర్చున్న పాక్‌కి ఈసారి అమెరికా చేసిన ప్రకటన మరింత ఇరకాటంలో పడేసింది. అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ కుమారుడు హంజా బిన్ లాడెన్, ప్రస్తుతం పాకిస్థాన్‌లోనే తలదాచుకుంటున్నాడనీ, అతని ఆచూకీ చెప్తే మిలియన్ డాలర్లు (సుమారు రూ.7.16 కోట్లు) బహుమతిగా ఇస్తామనీ అమెరికా ప్రకటించింది. 
 
హంజా బిన్ లాడెన్ ప్రస్తుతం పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో ఉండొచ్చుననీ, ఒకవేళ అక్కడ లేకుంటే ఇరాన్‌లో ఉండి వుంటాడని అనుమానం వ్యక్తం చేసిన అమెరికా, అతన్ని పట్టించినా లేదా ఆచూకీ చెప్పినా బహుమతి ఇస్తామని వెల్లడించింది. 
 
ఈ మేరకు యునైటెడ్ స్టేట్స్ డిప్లొమాటిక్ సెక్యూరిటీ అసిస్టెంట్ సెక్రటరీ మైఖేల్ ఇవనాఫ్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఆల్‌ఖైదాకు వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతుందని, లాడెన్‌ని మట్టుబెట్టిన తర్వాత ఉగ్రవాద సంస్థకు హంజా బిన్ లాడెన్ నాయకుడయ్యాడనీ, ఇంటర్నెట్‌లో అతని ఆడియో, వీడియో సందేశాలు వస్తున్నాయనీ గుర్తు చేసారు. కాగా, జనవరి 2017లో అమెరికా హంజా బిన్‌ను అంతర్జాతీయ తీవ్రవాదిగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments