Webdunia - Bharat's app for daily news and videos

Install App

వామ్మో.. టాంజానియాలో కొత్త వ్యాధి.. రక్తపు వాంతులు.. 15మంది మృతి

Webdunia
మంగళవారం, 9 ఫిబ్రవరి 2021 (09:36 IST)
Tanzania
కరోనా మహమ్మారి తరువాత అనేక కొత్త వ్యాధులు వెలుగులోకి వస్తున్నాయి. కరోనా న్యూ స్ట్రెయిన్ బ్రిటన్ ను, అటు దక్షిణాఫ్రికాను అతలాకుతలం చేస్తున్నది. బ్రెజిల్ లోనూ కొత్త స్ట్రెయిన్ తో కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ఇక ఇప్పుడు ఆఫ్రికా దేశం టాంజానియాలో ఓ కొత్త వ్యాధి భయపెడుతుంది. టాంజానియాలోని ఎంబేయా ప్రాంతంలోని ప్రజలు రక్తపు వాంతులు చేసుకుంటున్నారు. 
 
ఇలా రక్తంతో కూడిన వాంతులు చేసుకున్న గంటలోగా మరణిస్తున్నారు. దీంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తం అయింది. ఆ ఎంబెయా ప్రాంతానికి ప్రత్యేక వైద్యబృందాలను పంపి వ్యాధిపై పరిశోధన చేస్తున్నారు. 
 
ఇప్పటి వరకు ఈ కొత్త వ్యాధితో 15 మంది మరణించగా, 50 మందికి తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైద్యశాఖ తెలిపింది. అయితే, ఈ వింత వ్యాధి మిగతా ప్రాంతాలకు వ్యాప్తి చెందలేదని, శాంపిల్స్ సేకరించి ల్యాబ్ లో టెస్టింగ్ చేస్తున్నట్టు టాంజానియా వైద్యశాఖ ప్రకటించింది.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments