Webdunia - Bharat's app for daily news and videos

Install App

మసాజ్ ఆశచూపి... లూటీ శారు... ఎక్కడ?

Webdunia
బుధవారం, 14 అక్టోబరు 2020 (10:48 IST)
దుబాయ్‌లో ఓ భారతీయుడిని ఇద్దరు నైజీరియన్ మహిళలు లూటీ చేశారు. మసాజ్ ఆశ చూపి ఈ మోసానికి పాల్పడ్డారు. ఈ ఇద్దరు మహిళలకు మరికొందరు పురుషులు కూడా తోడై.. భారత వ్యక్తి వద్ద ఉన్న క్రెడిట్ కార్డులతో పాటు 600 దిర్హమ్స్‌ను బెదిరించి దోచుకున్నారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఉపాధి నిమిత్తం దుబాయ్‌లో ఉంటున్న 40 యేళ్ల వ్యక్తికి ఓ డేటింగ్ యాప్ ద్వారా ఓ మహిళ పరిచయమైంది. ఆ తర్వాత వారిద్దరూ చాటింగ్ చేసుకుంటూ వచ్చారు. 
 
ఈ క్రమంలో భారత వ్యక్తికి సదరు మహిళ మసాజ్ ఆశచూపించింది. 500 దిర్హమ్స్ ఇస్తే మసాజ్ చేస్తానంటూ తానుండే ఓ హోటల్ అడ్రస్ ఇచ్చింది. దీంతో భారత వ్యక్తి ఆమె చెప్పిన చోటికి వెళ్లాడు. అక్కడికి వెళ్లిన తర్వాత ఓ గదిలోకి తీసుకెళ్లింది. గదిలోకి వెళ్లిన వెంటనే మరికొందరు పురుషులు, మహిళలు వచ్చి భారతీయుడ్ని బంధించారు.
 
ఆ తర్వాత అతడి పర్సు లాక్కొని అందులో ఉన్న 600 దిర్హమ్స్‌తో పాటు రెండు క్రెడిట్ కార్డులు తీసుకున్నారు. వాటి పాస్‌వర్డ్స్ తీసుకుని బయటకెళ్లి నగదు డ్రా చేసుకున్నారు. అనంతరం ఈ విషయం ఎవరికీ చెప్పొదని బెదిరించి భారత వ్యక్తిని విడిచిపెట్టారు. 
 
ఈ ముఠా చెర నుంచి బయటపడిన భారతీయుడు నేరుగా సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు కేసు నమోదు చేసిన పోలీసులు... ఘటన జరిగిన ప్రదేశానికి వెళ్లి ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. 
 
బాధితుడు ఆ ఇద్దరు నిందితులను గుర్తుపట్టడంతో కటకటాల్లోకి నెట్టారు. ఇద్దరు నిందితులపై వేధింపులు, మోసం కేసు నమోదు చేశారు. ఈ ఘటన జూన్ 26న జరిగింది. సోమవారం ఈ కేసు దుబాయ్ కోర్టులో విచారణకు వచ్చింది. తదుపరి విచారణ డిసెంబర్ 30న జరుగనుంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments