Webdunia - Bharat's app for daily news and videos

Install App

టర్కీలో శాంతిర్యాలీ లక్ష్యంగా జంట పేలుళ్లు: 86కి చేరిన మృతులు

Webdunia
శనివారం, 10 అక్టోబరు 2015 (19:09 IST)
టర్కీలో శాంతిర్యాలీ లక్ష్యంగా శనివారం జంట బాంబు పేలుళ్ళు సంభవించాయి. టర్కీలోని అంకారాలోని ప్రముఖ రైల్వేస్టేషన్‌ సమీపంలో ఈ బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్ళలో మృతిచెందిన వారి సంఖ్య 86కి చేరింది. ఈ మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. 
 
టర్కీలో కుర్దు మిలిటెంట్లకు, ప్రభుత్వానికి మధ్య ఘర్షణలను వ్యతిరేకిస్తూ ప్రజలు శాంతి ర్యాలీ నిర్వహించేందుకు అక్కడికి చేరిన సమయంలో ఈ బాంబు పేలుళ్లు జరిగినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. 
 
ఈ పేలుళ్ళపై టర్కీ స్వదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ, స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం... ఈ ఘటనలో ఇప్పటివరకు 86 మంది చనిపోయారని, 126 మంది వరకు గాయపడినట్టు తెలిపారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం చుట్టుపక్కల ఉన్న ఆసుపత్రులకు తరలించారు. అయితే ఇవి ఆత్మాహుతి దాడులా, బాంబు దాడులా ఇంకా తెలియరాలేదని తెలిపింది. నవంబర్‌ 1 నుంచి టర్కీలో ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈ పేలుళ్ళు జరగడం గమనార్హం. 

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

Show comments