Webdunia - Bharat's app for daily news and videos

Install App

టర్కీలో భారీ భూకంపం... రిక్టర్ స్కేలుపై 6.8గా నమోదు

Webdunia
శనివారం, 25 జనవరి 2020 (09:07 IST)
టర్కీలో భారీ భూకంపం సంభవించింది. శుక్రవారం రాత్రి వచ్చిన ఈ భూకంపం ధాటికి ఇప్పటివరకు 20 మంది చనిపోగా, వందలాది మంది నిరాశ్రయులయ్యారు. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.8గా నమోదైంది. 
 
తూర్పు టర్కీలోని ఇలాజిజ్ ప్రావిన్స్‌, సివ్‌రిన్ జిల్లాలో ఈ భూకంపం సంభవించింది. భూప్రకంపనలు మొదలుకాగానే జనం భయంతో వీధుల్లోకి వచ్చి పరుగులు తీశారు. స్వల్ప కాలంలోనే 60 ప్రకంపనలు నమోదైనట్టు టర్కీ విపత్తు నిర్వహణ అధికారులు తెలిపారు.
 
భూకంపం ధాటికి కూలిన భవనాల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక సిబ్బంది రంగంలోకి దిగారు. శిథిలాల కింద 30 మంది వరకు చిక్కుకుని పోయి ఉంటారని భావిస్తున్నారు. వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. కాగా, సిరియా, లెబనాన్‌లోనూ భూప్రకంపనలు సంభవించినట్టు అధికారులు తెలిపారు

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments