Webdunia - Bharat's app for daily news and videos

Install App

శిథిలాల కింద 125 గంటల పాటు సజీవంగా ఉన్న 2 నెలల చిన్నారి

Webdunia
ఆదివారం, 12 ఫిబ్రవరి 2023 (14:43 IST)
టర్కీ, సిరియా దేశాల్లో మారణహోమం సృష్టించిన వరుస భూకంపాలు వేలాది మందిని పొట్టనబెట్టుకున్నాయి. ఈ భూకంపం ధాటికి కూలిపోయిన శిథిలాల నుంచి తొలగించే కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. ఇప్పటికే 28 వేల మంది చనిపోయినట్టు అంచనా వేస్తున్నారు. ఈ మరణాల్లో టర్కీలో 25 వేల మంది, సిరియాలో 3500 మంది చనిపోయినట్టు అంచనా వేస్తున్నారు. అయితే, ఈ భూకంపం సంభించి రోజులు గడిచిపోతున్నప్పటి కొందరు శిథిలాల కింద ప్రాణాలతో ఉడటం అక్కడి వారిలో కొత్త ఆశలు రేకెత్తిస్తుంది. 
 
హతెయ్ ప్రాంతంలో శనివారం శిథిలాల కింద చిక్కుకున్న రెండేళు నెలల చిన్నారిని సహాయ బృందాలు ప్రాణాలతో వెలికి తీశారు. భూకంపం సంభవించి 128 గంటల గడుస్తున్నా ఆ చిన్నారి శిథిలాల కింద సజీవంగా కనిపించడంతో అక్కడి వారి ఆనందానికి అంతేలేకుండా పోయింది. సిబ్బంది చిన్నారిని బయటకు తీసుకుని వస్తుండగా స్థానికులు పెద్ద ఎత్తున చప్పట్లు చరుస్తూ, ఈలలు వేస్తూ సంబర పడిపోయారు. 
 
టర్కీ మీడియా కథనాల ప్రకారం.. భూకంపం సంభవించి ఐదు రోజుల కావస్తున్నా కొందరు శిథిలాల కింద నుంచి ప్రాణాలతో బయటపడుతున్నారు. ఇటీవలే సహాయక సిబ్బంది రెండు సంవత్సరాల ఓ బాలికను రక్షించగలిగారు. అంతేకాకుండా.. ఆరు నెలల గర్భవతిని, 70 ఏళ్ల వృద్ధురాలినీ కాపాడారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ మాత్రమే కాదు, ప్రకటనల రంగంలోనూ పవర్ హౌస్

Pawan kalyan: అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్ - సింగపూర్ వెళ్ళనున్న పవన్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments