Webdunia - Bharat's app for daily news and videos

Install App

శిథిలాల కింద 125 గంటల పాటు సజీవంగా ఉన్న 2 నెలల చిన్నారి

Webdunia
ఆదివారం, 12 ఫిబ్రవరి 2023 (14:43 IST)
టర్కీ, సిరియా దేశాల్లో మారణహోమం సృష్టించిన వరుస భూకంపాలు వేలాది మందిని పొట్టనబెట్టుకున్నాయి. ఈ భూకంపం ధాటికి కూలిపోయిన శిథిలాల నుంచి తొలగించే కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. ఇప్పటికే 28 వేల మంది చనిపోయినట్టు అంచనా వేస్తున్నారు. ఈ మరణాల్లో టర్కీలో 25 వేల మంది, సిరియాలో 3500 మంది చనిపోయినట్టు అంచనా వేస్తున్నారు. అయితే, ఈ భూకంపం సంభించి రోజులు గడిచిపోతున్నప్పటి కొందరు శిథిలాల కింద ప్రాణాలతో ఉడటం అక్కడి వారిలో కొత్త ఆశలు రేకెత్తిస్తుంది. 
 
హతెయ్ ప్రాంతంలో శనివారం శిథిలాల కింద చిక్కుకున్న రెండేళు నెలల చిన్నారిని సహాయ బృందాలు ప్రాణాలతో వెలికి తీశారు. భూకంపం సంభవించి 128 గంటల గడుస్తున్నా ఆ చిన్నారి శిథిలాల కింద సజీవంగా కనిపించడంతో అక్కడి వారి ఆనందానికి అంతేలేకుండా పోయింది. సిబ్బంది చిన్నారిని బయటకు తీసుకుని వస్తుండగా స్థానికులు పెద్ద ఎత్తున చప్పట్లు చరుస్తూ, ఈలలు వేస్తూ సంబర పడిపోయారు. 
 
టర్కీ మీడియా కథనాల ప్రకారం.. భూకంపం సంభవించి ఐదు రోజుల కావస్తున్నా కొందరు శిథిలాల కింద నుంచి ప్రాణాలతో బయటపడుతున్నారు. ఇటీవలే సహాయక సిబ్బంది రెండు సంవత్సరాల ఓ బాలికను రక్షించగలిగారు. అంతేకాకుండా.. ఆరు నెలల గర్భవతిని, 70 ఏళ్ల వృద్ధురాలినీ కాపాడారు.  

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments