Webdunia - Bharat's app for daily news and videos

Install App

వచ్చే నెల 21న ఇండియాకు ట్రంప్!

Webdunia
గురువారం, 30 జనవరి 2020 (08:23 IST)
అమెరికా ప్రెసిడెంట్​ డొనాల్డ్​ ట్రంప్ మన దేశ పర్యటన దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి 21 నుంచి 24 మధ్యలో ఆయన మన దేశంలో టూర్​ చేస్తారని సమాచారం. ప్రధాని నరేంద్రమోడీతో కలిసి ట్రంప్ బహిరంగ సభలోపాల్గొంటారని తెలిసింది.

ఈ సభ అహ్మదాబాద్లో ఉండే అవకాశముందని చెబుతున్నా.. దీనిని ఇంకా ఖరారు చేయలేదని సమాచారం. ఢిల్లీలోని ఐటీసీ మౌర్య హోటల్​లో ఇప్పటికే ఆయన కోసం సూట్​ బుక్​ చేసినట్టు తెలిసింది. ఇంతకు ముందు క్లింటన్​, ఒబామా కూడా ఇదే హోటల్​లో బస చేశారు.

వచ్చే నెల 24 నుంచి మార్చి 30 వరకు జెనీవాలోని యూఎన్​ హ్యూమన్​ రైట్స్​ కౌన్సిల్​ వేదికగా మనదేశాన్ని బద్నామ్ చేయడానికి పాకిస్తాన్ ​రెడీ అవుతున్న సమయంలో ట్రంప్ టూర్ కు ప్రాధాన్యం ఏర్పడింది.

ఎన్నార్సీ, ఎన్​పీఆర్​తో పాటు మోడీ పాలనలో ముస్లింలకు సెక్యూరిటీ లేదని వాదనలను కూడా పాకిస్తాన్​  కౌన్సిల్​ దృష్టికి తీసుకెళ్లే అవకాశముందని మన అధికారులు కొందరు చెప్పారు.
 
చర్చించే అంశాలివీ.......
ట్రంప్ టూర్​లో ట్రేడ్ చర్చలే ప్రధానాంశంగా ఉంటుందని అధికారులు చెప్పారు. దీంతో పాటు చైనా, ఇండో, పసిఫిక్​, ఆఫ్గనిస్తాన్​, ఇరాన్​, పాక్‌లో టెర్రరిజం లాంటి అంశాలు కూడా చర్చకువచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments