Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూలో ఎంట్రన్స్ ఫీజు తగ్గుతుందని.. ఫెన్సింగ్ ఎక్కి దూకాడు.. పులి చంపేసింది..

ఎంట్రన్స్ ఫీజు నుంచి తప్పించుకుందామని ఫెన్సింగ్ దాటి జా పార్కులోకి వెళ్లిన ఓ మనిషిపై పులి దాడి చేసి చంపేసింది. అతని భార్య, కొడుకు చూస్తుండగానే దారుణం జరిగింది. చైనాలోని జింయాంగ్ జింగ్ ప్రావిన్స్‌లోని

Webdunia
బుధవారం, 1 ఫిబ్రవరి 2017 (10:09 IST)
ఎంట్రన్స్ ఫీజు నుంచి తప్పించుకుందామని ఫెన్సింగ్ దాటి జా పార్కులోకి వెళ్లిన ఓ మనిషిపై పులి దాడి చేసి చంపేసింది. అతని భార్య, కొడుకు చూస్తుండగానే దారుణం జరిగింది. చైనాలోని జింయాంగ్ జింగ్ ప్రావిన్స్‌లోని యంగ్ నర్ జాతీయ పార్క్ లో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. డాంగియన్ లేక్ పార్క్‌లో ఫ్యామిలీతో కలిసి జూపార్క్ సందర్శనకు వెళ్లాడు చైనాకు చెందిన జాంగ్. ఫ్యామిలీ మెంబర్స్ ఎంట్రన్స్ ఫీ కట్టి.. టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్లారు. జాంగ్.. అతని ఫ్రెండ్ ఎంట్రన్స్ టికెట్స్ లేకుండా లోపలికి వెళ్దామని ఫెన్సింగ్ ఎక్కి పార్క్‌లోకి దూకేశారు. వాళ్లు ఫెన్సింగ్ దాటిన చోటే టైగర్ జోన్ ఉండటంతో ప్రమాదం తప్పలేదు. 
 
ఇలా టైగర్‌లో చిక్కుకున్న జాంగ్‌పై పులి వేట జరుగుతుంటే జూలోని సందర్శకులు కళ్లారా చూశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశారు చూసిన వాళ్లు. జాంగ్‌‍పై దాడి చేసిన పులిని పోలీసులు కాల్చేశారు. టైగర్ అటాక్ సమయంలో అతని స్నేహితుడు దూరంగా నిలబడి చూస్తూ ఉండిపోయాడు. పోలీసులు అతన్ని రక్షించారు.

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments