Webdunia - Bharat's app for daily news and videos

Install App

Speed Rail: విమానంతో పోటీ పడే సరికొత్త రైలు- డ్రాగన్ కంట్రీ అదుర్స్ (video)

సెల్వి
సోమవారం, 14 జులై 2025 (16:24 IST)
విమానంతో పోటీ పడే సరికొత్త రైలు ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది చైనా. హైస్పీడ్ రైళ్లపై దృష్టిపెట్టిన డ్రాగన్ కంట్రీ  మరో అద్భుతం సృష్టించింది. ఇందులో భాగంగా గంటకు 600 కిలోమీటర్ల వేగంతో వెళ్లే రైలును రూపొందించింది. తాజాగా 17వ మోడ్రన్ రైల్వే ఎగ్జిబిషన్‌లో మాగ్లెవ్‌ రైలును చైనా ప్రదర్శించి ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరిచింది. 
 
కేవలం 7 సెకండ్లలోనే ఇది 600 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని అధికారులు వెల్లడించారు. ఈ రైలు అందుబాటులోకి వస్తే.. బీజింగ్ నుంచి షాంఘై మధ్య ఉండే 1200 కి.మీ దూరాన్ని కేవలం 2.30 గంటల్లో చేరుకుంటుందని అధికారులు అంచనా. 
 
మ్యాగ్నెటిక్‌ లివిటేషన్ (మాగ్లెవ్) టెక్నాలజీ సాయంతో ఈ రైలు అత్యధికంగా వేగంతో దూసుకెళ్లగలదు. ఈ టెక్నాలజీ అయస్కాంత వ్యతిరేక క్షేత్రాలను ఉపయోగించి.. ట్రాక్ నుంచి రైలును పైకి లేపేందుకు సాయపడుతుంది. దీంతో ఫ్రిక్షన్ తగ్గి రైలు నిశ్శబ్దంగా, వేగంగా వెళ్లగలుగుతుందని అధికారులు తెలిపారు. అయితే ఈ రైలు బరువు ఏకంగా 1.1 టన్నులుగా ఉండనుంది. ఇది అందుబాటులోకి వస్తే ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన రైలుగా చరిత్ర 
సృష్టించనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలనాటి అందాల తార బి.సరోజా దేవి ఇకలేరు... చంద్రబాబు - పవన్ నివాళలు

Vishal: కార్తీ, జీవా ముఖ్య అతిథులుగా విశాల్ 35వ చిత్రం చెన్నైలో పూజా కార్యక్రమాలు

బి.సరోజాదేవి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్, బాలక్రిష్ణ

దివికేగిన అలనాటి నటి సరోజా దేవి: ఏకంగా 180 చిత్రాలు నటించారు.. తెలుగులో ఎన్ని సినిమాలు?

బెంగుళూరులో సీనియర్ నటి సరోజా దేవి (87) మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments