Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉగ్రవాది మొహ్మద్ నవేద్ పాకిస్థాన్ పౌరుడే.. ఇవిగో సాక్ష్యాలు .. భారత్ నిఘా వర్గాలు

Webdunia
గురువారం, 3 సెప్టెంబరు 2015 (09:38 IST)
జమ్మూకాశ్మీర్ సరిహద్దుల్లోని భద్రతా బలగాలపై దాడులకు తెగబడి ప్రాణాలతో పట్టుబడిన ఉగ్రవాది మొహ్మద్ నవేద్ యూకూబ్ ముమ్మాటికీ పాకిస్థాన్ ఉగ్రవాదేనని భారత నిఘా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇందుకు సంబంధించిన పలు కీలక ఆధారాలను కూడా సేకరించాయి. అంతేకాకుండా, నవేద్ పుట్టుపూర్వోత్తరాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించాయి. 
 
ఈ ఉగ్రవాది పట్టుబడిన తర్వాత తాను పాకిస్థాన్ పౌరుడినని, లష్కరే తోయిబా తనను ఇక్కడకు పంపించినట్టు వెల్లడించాడు. అయితే, పాకిస్థాన్ మాత్రం అతను తమ దేశస్థుడు కాదంటూ నిస్సిగ్గుగా ప్రకటించింది. దీంతో నవేద్‌ పుట్టు పూర్వోత్తరాలను భారత్‌ నిఘా సంస్థలు పకడ్బందీగా సేకరించాయి. పాకిస్థాన్ జనగణన రిజిస్టర్‌లో అతడి నమోదు సంఖ్యను, 2014లో ఇచ్చిన గుర్తింపు కార్డు నంబరును సేకరించాయి. 
 
ఫైసలాబాద్‌లోని రఫీక్‌ కాలనీవాసిగా నవేద్‌ నివాసాన్ని గుర్తించే గూగుల్‌ మ్యాప్‌లను రూపొందించింది. ఇలా పాక్‌ బండారాన్ని బట్టబయలు చేసే సత్యాలతో 39 పేజీల నివేదికను రూపొందించింది. కాగా, భారత్‌లో అలజడులే లక్ష్యంగా పాకిస్థాన్‌ గూఢచార సంస్థ ఇంటర్‌ సర్వీసెస్‌ ఇంటెలిజెన్స్ ‌- ఐఎస్ఐ ఉగ్రమూకలను పోషిస్తున్న విషయంతెల్సిందే. 

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments