Webdunia - Bharat's app for daily news and videos

Install App

'నాసా' పోటీల్లో సత్తా చాటిన తెలుగోళ్లు

Webdunia
సోమవారం, 23 ఆగస్టు 2021 (17:47 IST)
అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) నిర్వహించిన పోటీ పరీక్షల్లో తెలుగు విద్యార్థుల్లో ముఖ్యంగా మహిళలు తమ సత్తా చాటారు. చంద్రుడిపై చేపట్టే పరిశోధనల్లో భాగంగా ఈ పోటీలను నాసా నిర్వహించింది. ఈ పోటీల్లో రాష్ట్రానికి చెందిన బృందం సత్తా చాటింది. 
 
ప్రపంచ వ్యాప్తంగా ఈ పోటీల్లో వెయ్యికిపైగా బృందాలు పాల్గొనగా, తెలుగు బృందం టాప్‌-10లో నిలిచి 25 వేల డాలర్లు (సుమారు రూ.18.8 లక్షలు) గెల్చుకోవడంతోపాటు రెండోదశ పోటీలకు ఎంపికైంది. చంద్రునిపై ఉన్న మంచును నీరుగా మార్చే చర్యల్లో భాగంగా ‘నాసా’ గత ఏడాది నవంబరులో ఈ పోటీలకు శ్రీకారం చుట్టింది. 
 
‘బ్రేక్‌ ది ఐస్‌ లూనార్‌ చాలెంజ్‌’ పేరుతో చేపట్టిన పోటీలకు ఔత్సాహిక పరిశోధకుల నుంచి ప్రాజెక్ట్‌లను ఆహ్వానించింది. దీంతో వెయ్యికిపైగా ప్రాజెక్టులు వచ్చాయి. వీటిలో 48 దేశాలకు చెందిన 374 ప్రాజెక్టులను పోటీలకు ఎంపిక చేసింది. 
 
రాష్ట్రానికి చెందిన కరణం ఆశీష్ కుమార్‌, అమరేశ్వర ప్రసాద్‌ చుండూరు, ప్రణవ్‌ ప్రసాద్‌ రూపొందించిన ఎల్‌-వాటర్‌(లూనార్‌ వాట ర్‌ అబ్‌స్ట్రాక్షన్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ బై ఎక్సకవేషన్‌ ఆఫ్‌ రెగోలిత్‌) ప్రాజెక్ట్‌ టాప్‌-10లో నిలిచింది. 25 వేల డాలర్లను బహుమతిగా గెల్చుకోవడంతో పాటు రెండో దశ పోటీలకు ఎంపికైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments