Webdunia - Bharat's app for daily news and videos

Install App

మలాలా యూసుఫ్‌జాయ్‌పై కాల్పులు జరిపిన ఉగ్రవాది పరార్

Webdunia
శుక్రవారం, 7 ఫిబ్రవరి 2020 (15:33 IST)
2012లో పాకిస్థాన్‌లోని స్వాట్ వ్యాలీలో విద్యా హక్కుల గురించి ప్రచారం చేస్తున్న సమయంలో నోబెల్ బ‌హుమ‌తి గ్ర‌హీత పాకిస్థాన్‌కు చెందిన మ‌లాలా యూసుఫ్‌జాయ్‌పై కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఆమెపై కాల్పులు జరిపిన తాలిబన్ ఉగ్రవాది ఇషానుల్లా జైలులో ఇంతవరకు వున్నాడు. అయితే ఇషానుల్లా ప్రస్తుతం జైలు నుంచి తప్పించుకున్నాడు. 
 
ఈ మేరకు సదరు ఉగ్ర‌వాది ఆడియో క్లిప్‌‌ను విడుదల చేసాడు. తాను పోలీసుల చెర నుంచి త‌ప్పించుకున్న‌ట్లు తెలిపాడు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. జనవరి 11వ తేదీన పోలీసుల చెర నుంచి అతను తప్పించుకున్నట్లు తెలుస్తోంది. 
 
కాగా 2017లో పోలీసులు ఇషాన్‌ను అరెస్టు చేశారు. 2012లో మ‌లాలాపై ఈ ఉగ్ర‌వాది ఇషాన్ కాల్పులు జ‌రిపాడు. ఆ కాల్పుల్లో మ‌లాలా త‌ల‌లోకి బుల్లెట్ దిగింది. 2014లో పెషావ‌ర్‌లో ఆర్మీ స్కూల్‌పై జ‌రిగిన దాడికి కూడా ఇత‌గాడే కార‌కుడు కావడం గమనార్హం. ఈ దాడిలో 134 మంది స్కూల్ పిల్లలు, 15 మంది సిబ్బంది మరణించారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments