Webdunia - Bharat's app for daily news and videos

Install App

మలాలా యూసుఫ్‌జాయ్‌పై కాల్పులు జరిపిన ఉగ్రవాది పరార్

Webdunia
శుక్రవారం, 7 ఫిబ్రవరి 2020 (15:33 IST)
2012లో పాకిస్థాన్‌లోని స్వాట్ వ్యాలీలో విద్యా హక్కుల గురించి ప్రచారం చేస్తున్న సమయంలో నోబెల్ బ‌హుమ‌తి గ్ర‌హీత పాకిస్థాన్‌కు చెందిన మ‌లాలా యూసుఫ్‌జాయ్‌పై కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఆమెపై కాల్పులు జరిపిన తాలిబన్ ఉగ్రవాది ఇషానుల్లా జైలులో ఇంతవరకు వున్నాడు. అయితే ఇషానుల్లా ప్రస్తుతం జైలు నుంచి తప్పించుకున్నాడు. 
 
ఈ మేరకు సదరు ఉగ్ర‌వాది ఆడియో క్లిప్‌‌ను విడుదల చేసాడు. తాను పోలీసుల చెర నుంచి త‌ప్పించుకున్న‌ట్లు తెలిపాడు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. జనవరి 11వ తేదీన పోలీసుల చెర నుంచి అతను తప్పించుకున్నట్లు తెలుస్తోంది. 
 
కాగా 2017లో పోలీసులు ఇషాన్‌ను అరెస్టు చేశారు. 2012లో మ‌లాలాపై ఈ ఉగ్ర‌వాది ఇషాన్ కాల్పులు జ‌రిపాడు. ఆ కాల్పుల్లో మ‌లాలా త‌ల‌లోకి బుల్లెట్ దిగింది. 2014లో పెషావ‌ర్‌లో ఆర్మీ స్కూల్‌పై జ‌రిగిన దాడికి కూడా ఇత‌గాడే కార‌కుడు కావడం గమనార్హం. ఈ దాడిలో 134 మంది స్కూల్ పిల్లలు, 15 మంది సిబ్బంది మరణించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

షూటింగ్ లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కు స్వల్పగాయాలు !

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ సరైన సినిమా లేదు: నిర్మాత నాగవంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments