Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేపాల్‌ టూర్ సక్సెస్.. కీలక ఒప్పందాలు కుదిరాయ్!: సుష్మ

Webdunia
సోమవారం, 28 జులై 2014 (11:47 IST)
నేపాల్‌లో తన మూడు రోజుల పర్యటన విజయవంతం అయిందని భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ అభివర్ణించారు. ఈ పర్యటన సందర్భంగా రెండు దేశాల మధ్య అనేక కీలక ఒప్పందాలు కుదిరాయని వెల్లడించారు. 
 
విద్యుత్ వాణిజ్య ఒప్పందం ఖరారైందని, అలాగే 1950లో రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాన్ని కూడా వాస్తవానుగుణంగా సమీక్షించాలని నిర్ణయించినట్లు స్వదేశానికి బయలుదేరే ముందు త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పేర్కొన్నారు. 
 
అనేక రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించుకునేందుకు కృషి చేయాలని నిర్ణయించుకున్నామని, ఈ దిశగా ఎలాంటి అవరోధాలు తలెత్తినా వాటిని చర్చల ద్వారా తొలగించుకోవాలనీ సంకల్పించినట్లు ఆమె వెల్లడించారు. 
 
ఈ మూడు రోజుల పర్యటన సందర్భంగా నేపాల్ అధ్యక్షుడు రామ్ భరణ్ యాదవ్, ప్రధాని సుశీల్ కొయిరాలాలతో సుష్మా స్వరాజ్ సమావేశమయ్యారు. అలాగే నేపాల్ మావోయిస్టు నాయకుడు ప్రచండతో కూడా మంతనాలు జరిపారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments