Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌కు రానున్న 500 ఏళ్ల నాటి పురాతన హనుమాన్ విగ్రహం

Webdunia
గురువారం, 27 అక్టోబరు 2022 (19:13 IST)
Hanuman
ఆస్ట్రేలియాలోని అమెరికా రాయబార కార్యాలయం, అమెరికా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోంల్యాండ్‌ సెక్యూరిటీ, భారత ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు కలిసి 500 ఏళ్ల పురాతనమైన హనుమాన్‌ విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆపై 500 ఏళ్లనాటి పురాతన హనుమాన్‌ విగ్రహాన్ని భారత్‌కు అప్పగించినట్లు అమెరికా వెల్లడించింది. అమెరికా విదేశాంగ శాఖ వాషింగ్టన్‌లోని బెంజిమన్‌ ఫ్రాంక్లిన్‌ రూమ్‌లో దీపావళి వేడుకలను నిర్వహించింది. 
 
అమెరికా విదేశాంగశాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సంస్కృతిని కాపాడేందుకు, దెబ్బతిన్న చారిత్రక భవనాలను రక్షించేందుకు, దొంగతనాలకు గురైనా చారిత్రక సంపదను తిరిగి సంపాదించేందుకు అమెరికా రాయబారులు సహకరిస్తారన్నారు. దీపావళి వంటి వేడుకలను చేసుకొని మతస్వేచ్ఛను తాము చూపిస్తామని బ్లింకెన్‌ తెలిపారు. 
 
దక్షిణ భారత్‌లోని ఓ ఆలయంలోని 500 ఏళ్లనాటి హనుమాన్‌ విగ్రహాన్ని దొంగలించారు. దీనిని ఆస్ట్రేలియా వ్యక్తి కొనుగోలు చేశాడు. కానీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు అప్రమత్తం చేయడంతో ఆ విగ్రహాన్ని స్వాధీనం చేసుకొనేందుకు పూర్తిగా సహకరించారని అమెరికా విదేశాంగ శాఖ పేర్కొంది. ఆస్ట్రేలియాలో స్వాధీనం చేసుకొన్న ఈ విగ్రహాన్ని అప్పట్లో అమెరికాకు అప్పగించారు. తాజాగా ఇప్పుడు అది భారత్‌కు చేరనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Deepika Padukone: అల్లు అర్జున్, అట్లీ చిత్రంలో బాలీవుడ్ దీపికా పదుకొనె

Pawan : ఎ.ఎం.రత్నం కు అన్నీ అడ్డంకులేనా? హరిహర వీరమల్లు ఆలస్యానికి కారణమదేనా?

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments