Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిడ్డలను కంటే రూ.62 లక్షలు.. బంపర్ ఆఫర్ ప్రకటించిన కంపెనీ..

ఠాగూర్
సోమవారం, 12 ఫిబ్రవరి 2024 (09:09 IST)
ప్రపంచంలోని పలు దేశాల్లో జననాల రేటు గణనీయంగా పడిపోతుంది. ఇప్పటికే చైనా దేశంలో ఈ పరిస్థితి అధికంగా ఉంది. దీంతో చైనా ప్రభుత్వం ఇంతకాలం అమలు చేస్తూ వచ్చిన కుటుంబ నియంత్రణను ఎత్తివేసింది. తమ దేశ పౌరులు ఎంతమందినైనా కనొచ్చని ప్రకటించింది. గతంలో ఒక్కరికి మించి సంతానం కనేందుకు వీలులేదు. కానీ ఇపుడు ఈ నిబంధన ఎత్తివేసింది. ఇలా.. జననాల రేటు పడిపోతున్న దేశాల్లో ఇపుడు దక్షిణ కొరియా కూడా చేరింది. దీంతో ఈ జనన రేటును పెంచుకునేందుకు ఈ దేశానికి చెందిన ఓ కంపెనీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రముఖ నిర్మాణ రంగ కంపెనీ బూయంగ్ ఉద్యోగులకు భారీ ఆఫర్ ప్రకటించింది. 
 
పిల్లల్ని కన్న ప్రతి సారీ రూ.62.54 లక్షలు (100 మిలియన్ కొరియన్ వాన్లు) చెల్లిస్తామని ప్రకటించింది. 2021లో 70 మంది పిల్లకు జన్మనిచ్చిన ఉద్యోగులకూ రూ.43.77 లక్షలు చెల్లించాలని యోచిస్తుంది. ముగ్గురు పిల్లలున్న ఉద్యోగులకు రూ.1.86 కోట్ల లక్షల నగదు లేదా ఇంటి అద్దె సదుపాయాన్ని కల్పించాలని భావిస్తుంది. ఈ ఆఫర్లు ఆడ, మగ ఉద్యోగులిద్దరికీ వర్తిస్తాయని పేర్కొంది. 2022లో ప్రపంచంలో అతి తక్కువ సంతానోత్పత్తి రేటు దక్షిణ కొరియాలోనే నమోదు కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi : పెద్ది చిత్రం తాజా అప్ డేట్ - రామ్ చరణ్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ

థ్రిల్లర్ కథతో మలయాళ ప్రవింకూడు షప్పు- ప్రవింకూడు షప్పు సమీక్ష

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments