బుల్లెట్ రైలులోకి పాము ఎలా వచ్చింది... ప్రయాణం 17 నిమిషాలు ఆలస్యం!!

వరుణ్
బుధవారం, 17 ఏప్రియల్ 2024 (12:10 IST)
ప్రపంచంలో జపాన్ బుల్లెట్ రైళ్లకు ప్రత్యేక పేరుతో పాటు గుర్తింపు ఉంది. వేగానికి మారు పేరుగా ఈ రైళ్లను చెబుతారు. అలాంటి రైలులో పాము చేరిపోయింది. ఈ కారణంగా ఆ రైలు ప్రయాణం 17 నిమిషాల పాటు ఆలస్యమైంది. సాధారణంగా పాము వల్ల రైలు ప్రయాణం ఆలస్యం కావడం అనేది చాలా చాలా అరుదు. కానీ, ఇలాంటి అత్యంత అరుదైన ఘటన ఇపుడు జపాన్ నగరంలో చోటుచేసుకుంది. 
 
రైలులో ఓ 40 సెంటీమీటర్ల చిన్న పాము కదులుతుండటాన్ని ఓ ప్రయాణికుడు గుర్తించాడు. ఆ వెంటనే భద్రతా సిబ్బందికి సమాచారం చేరవేశాడు. దీంతో బుల్లెట్ రైలు 17 నిమిషాల పాటు నిలిపివేశారు. ఆ బోగీలోని ప్రయాణికులను మరో బోగీలోకి తరలించి గమ్యస్థానానికి చేర్చారు. అయితే, ఆ బుల్లెట్ రైలులోకి ఆ పాము ఎలా వచ్చిందన్నది తెలియలేదు. అలాగే, ఆ పాము కూడా విషపూరితమా కాదా అన్నది కూడా తెలియరాలేదు. 
 
ఈ ఘటనలో అదృష్టవశాత్తూ ప్రయాణికులెవ్వరూ గాయపడలేదని జపాన్ సెంట్రల్ రైల్వే కంపెనీ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. కాగా, జపాన్ రైల్వేస్ 1964లో బుల్లెట్ రైలు సేవలు ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్క ప్రమాదం లేదా మరణం సంభవించలేదు. ఈ రైళ్లు గంటకు 285 కిలోమీటర్ల వేగంతో దూసుకెళుతాయి. ఈ రైళ్ల సగటు ఆలస్య వ్యవధి కేవలం 0.2 నిమిషాలే కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments