Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్ ఆర్మీ చీఫ్‌కు ఫీల్డ్ మార్షల్ హోదా కాదు.. రాజు బిరుదు ఇవ్వాల్సింది : ఇమ్రాన్ ఖాన్

ఠాగూర్
శుక్రవారం, 23 మే 2025 (12:32 IST)
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ చేట్టిన సైనిక చర్యలో చావుదెబ్బతిన్నప్పటికీ పాకిస్థాన్ పాలకుల వంకర బుద్ధిమాత్రం మారలేదు. భారత్ ఆర్మీ దెబ్బకు పాకిస్థాన్ తోకముడిచినప్పటికీ.. ఆ దేశ ఆర్మీ చీఫ్‌ అసిఫ్ మునీర్‌కు మాత్రం ఫీల్డ్ మార్షల్ అనే హోదాను పాక్ ప్రభుత్వం ఇచ్చింది. ఈ తరహా హాదాను పొందిన రెండో వ్యక్తి మునీర్ కావడం గమనార్హం. 
 
దీనిపై పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఆటవిక చట్టం సాగుతోందని, ఇలాంటి పరిస్థితుల్లో జనరల్ మునీర్‌కు రాజు అనే బిరుదు ఇచ్చివుంటే ఇంకా బాగుండేదని ఎద్దేవా చేశారు. ఈ మేరకు జైలు నుంచే ఎక్సే వేదికగా ఓ ట్వీట్ చేశారు.
 
పాకిస్థాన్ చరిత్రలో ఫీల్డ్ మార్షల్ హోదా పొందిన రెండో సైనికాధికారిగా జనరల్ మునీర్ కావడం గమనార్హం. ఈ పదోన్నతిపై ఇమ్రాన్ స్పందిస్తూ, 'మాషా అల్లా.. జనరల్ అసిమ్ మునీర్‌ను ఫీల్డ్ మార్షల్‌ను  చేశారు. నిజం చెప్పాలంటే ఆయనకు రాజు అనే బిరుదు ఇచ్చివుంటే ఇంగా బాగుండేది. ఎందుకంటే ప్రస్తుతం దేశంలో ఆటవిక చట్టం నడుస్తోంది. అడవిలో ఒక్కడే రాజు ఉంటాడు' అని వ్యాఖ్యానించారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments