Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిలిప్పీన్స్‌లో లాక్‌డౌన్ .. వీధులు - రోడ్లపై కనిపిస్తే కాల్చి చంపండి?!

Webdunia
గురువారం, 2 ఏప్రియల్ 2020 (13:44 IST)
కరోనా వైరస్ నుంచి తమ తమ ప్రజలను కాపాడుకనేందుకు అనేక దేశాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. అలాగే, ఎన్నో రకాలైన కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నాయి. అయితే, కొన్ని దేశాల్లో ప్రజలు మాత్రం ఈ లాక్‌డౌన్ నిబంధనలు యధేచ్చగా అతిక్రమిస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఫిలిప్పీన్స్ అధినేత రొడ్రిగో డ్యూటెర్టే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. కనిపిస్తే కాల్చివేత ఆదేశాలను జారీచేశారు. లాక్‌డౌన్ నిబంధ‌న‌లు ఉల్లంఘించ‌డాన్ని తీవ్రమైన నేరంగా పరిగణిస్తామని ఆయన హెచ్చ‌రించారు. లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కాల్చి చంపండి అంటూ పోలీసులు, మిలిటరీ అధికారులను రోడ్రిగో ఆదేశించారు. 
 
లాక్‌డౌన్ సమయంలో ప్రతి ఒక్కరూ తమతమ ఇళ్ళకే పరిమితం కావాలని ఆయన ఆదేశించారు. అపుడే కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని తెలిపారు. ప్రతిరోజూ వందల సంఖ్యలో కరోనా వైరస్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో సమస్య తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఎవ‌రూ బ‌య‌ట‌కు రావ‌ద్ద‌ని ఆయ‌న సూచించారు. 
 
అయితే ఖాత‌రు చేయ‌కుంటే కాల్చి చంపండి అన్న రోడ్రిగో ఆదేశాల‌పై మాన‌వ‌హ‌క్కుల కార్య‌క‌ర్త‌లు మండిప‌డుతున్నారు. నెటిజ‌న్లు సైతం రోడ్రిగో వ్యాఖ్య‌ల‌ను తీవ్రంగా ఖండిస్తున్నారు. కాగా, క‌రోనా తీవ్రత దృష్ట్యా అధ్య‌క్షుడు అలా మాట్లాడార‌ని, పోలీసులు, మిలిట‌రీ వాళ్లు ఎవ‌రినీ షూట్ చేయ‌ర‌ని ఫిలిప్పీన్స్ పోలీస్ చీఫ్ వివ‌ర‌ణ ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పచ్చని జీవితంలో నిప్పులు పోసిన కేన్సర్: టీవీ నటి దీపిక కాకర్‌కు లివర్ కేన్సర్

రొమాంటిక్ కామెడీ చిత్రంలో జాన్వీ కపూర్ - అందాల ఆరబోత?

Gaddar Awards: సినిమాలు చూడకుండా గద్దర్ అవార్డులు ప్రకటించారా?

ఈ లోకంలో నాలాంటి వారు : ఇళయరాజా

షష్టిపూర్తి కథను నమ్మాను, అందుకే మ్యూజిక్ ఇచ్చాను - ఇళయరాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments