Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రిటన్‌లోనే స్కాట్లాండ్.. సమైక్యవాదానికే ప్రజల పట్టం!

Webdunia
శుక్రవారం, 19 సెప్టెంబరు 2014 (12:07 IST)
స్కాట్లాండ్ స్వతంత్ర దేశంగా ఆవిర్భవించేందుకు ఆ దేశంలోని మెజార్టీ ప్రజలు వ్యతిరేకించారు. గ్రేట్ బ్రిటన్‌లోనే కలిసివుండేందుకు మొగ్గు చూపుతూ సమైక్యవాదానికే పట్టం కట్టారు. బ్రిటన్ నుంచి విడిపోయే అంశంపై స్కాట్లాండ్‌లో రెఫరెండం నిర్వహించారు. మొత్తం 32 జిల్లాలకు చెందిన 42 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 
 
వీరిలో బ్రిటన్‌తో కలిసివుండేలా సమైక్యవాదానికి ఓటు వేసిన వారిలో 55 శాతం మంది ఉండగా, స్వతంత్ర దేశంగా ఆవిర్భవించేందుకు మొగ్గు చూపిన వారు 45 శాతం మంది ప్రజలు ఉన్నారు. ఈ ఓటింగ్‌లో పాల్గొన్న వారిలో అత్యధికులు బ్రిటన్‌తో ఉండేందుకే మొగ్గు చూపడంతో 300 యేళ్ళ బ్రిటన్ - స్కాట్లాండ్ అనుబంధం యథావిధిగా కొనసాగనుంది. ఈ ఓటింగ్‌లో 26 జిల్లాలకు చెందిన స్కాట్లాండ్ వాసులు ఏకపక్షంగా తీర్పునివ్వగా, ఆరు జిల్లాల్లో మాత్రం విభజనకు అనుకూలంగా ఓట్లు వేయడం గమనార్హం.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments