మున్ముందు అగ్నిగుండమే... 2027 నాటికి ఉష్ణోగ్రతలో మరింత పెరుగుల

Webdunia
గురువారం, 18 మే 2023 (09:23 IST)
వచ్చే ఐదేళ్ళలో ప్రపంచ వ్యాప్తంగా భూతాపం మరింతగా పెరిగిపోతుందని ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది. భూ ఉష్ణోగ్రత పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్‌ (2.7 డిగ్రీల ఫారెన్‌హీట్‌) వద్ద నిలువరించకపోతే ప్రపంచమంతటా పర్యావరణ విధ్వంసం పెచ్చరిల్లుతుందని తెలిపింది. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ భూతాపం పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్‌ వద్ద కట్టడి చేయాలని 2015లో పారిస్‌ వాతావరణ ఒప్పందం చేసుకున్నారు. 
 
అయితే, ఏ ఒక్క ప్రపంచ దేశాలు కర్బన ఉద్గారాలను ఆశించిన స్థాయిలో అరికట్టలేక పోతున్నందున 2030 తర్వాత భూఉష్ణోగ్రత పెరుగుదల 1.5 డిగ్రీలకు చేరుకొంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అయితే, అంతకంటే ముందే ప్రమాదం ముంచుకు వస్తోందని.. ఎల్‌నినో, లానినా సయ్యాట వల్ల ఇప్పటినుంచి 2027 లోపు 1.5 డిగ్రీలకు మించి భూతాపం పెరిగే అవకాశముందని ప్రపంచ వాతావరణ పరిశోధన సంస్థ తాజా నివేదిక బుధవారం హెచ్చరించింది. 
 
వాతావరణ రికార్డులను నమోదు చేయడం ఆరంభించినప్పటి నుంచి ఎన్నడూ లేని విధంగా రాగల అయిదేళ్లూ భూమికి అత్యుష్ణ సంవత్సరాలుగా నిలిచిపోయే అవకాశం 98 శాతం ఉన్నట్లు దీని సారాంశం. ఎల్‌నినో వల్ల పెరగనున్న వేడి శాశ్వతం కాదనీ, 2030 లోపు తరచుగా ఉష్ణోగ్రత 1.5 డిగ్రీలను దాటవచ్చని శాస్త్రజ్ఞులు వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments