Webdunia - Bharat's app for daily news and videos

Install App

850 మంది భారతీయ ఖైదీల విడుదల....

Webdunia
గురువారం, 21 ఫిబ్రవరి 2019 (20:16 IST)
సౌదీ జైళ్ళ నుంచి 850 మంది భారతీయ ఖైదీలకు విముక్తి లభించనుంది. ప్రస్తుతం సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ భారత్‌లో పర్యటిస్తున్నారు. ఆయన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా విమానాశ్రయానికి వెళ్లి స్వాగతం పలికారు. ఇందుకోసం ప్రధాని తన ప్రొటొకాల్‌ను సైతం పక్కనపెట్టేశారు. 
 
ఆ తర్వాత సౌదీ యువరాజు, ప్రధానమంత్రిలు ఇరు దేశాల ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ చర్చల్లో భాగంగా, సౌదీలో వివిధ జైళ్ళలో మగ్గుతున్న ఏకంగా 850 మంది ఖైదీలను విడుదల చేయాల్సిందిగా మోడీ కోరడం, దానికి సౌదీ యువరాజు సమ్మతించడం జరిగింది. 
 
అలాగే, ఇప్పటివరకు లక్షా 75 వేలుగా ఉన్న భారత్ హజ్ యాత్రికుల కోటా సంఖ్యను రెండు లక్షలకు పెంచుతున్నట్టు కూడా తెలిపారు. కాగా, భారత్ పర్యటనకు ముందు పాకిస్థాన్‌లో పర్యటించిన సౌదీ యువరాజు.. పాకిస్థాన్‌కు చెందిన 2000 మంది ఖైదీలను విడుదల చేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej: వరుణ్ తేజ్ హీరోగా ఇండో-కొరియన్ హారర్-కామెడీ చిత్రం

'కన్నప్ప'ను ట్రోల్ చేస్తే శివుని ఆగ్రహానికి శాపానికి గురవుతారు : రఘుబాబు

నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ రిలీజ్ విడుదల తేదీ మార్పు

Suhas: స్పిరిట్ లో పాత్ర ఫైనల్ కాలేదు, విలన్ పాత్రలంటే ఇష్టం : సుహాస్

David Warner : రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలకు క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ సీరియస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

White Pumpkin Juice: పరగడుపున తెల్ల గుమ్మడికాయ రసం-ఒక నెలలో ఐదు కిలోల బరువు డౌన్

తర్వాతి కథనం
Show comments