Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలిత సంతకాన్ని పార్టీ నేతలు ఫోర్జరీ చేసే ఛాన్స్ : బహిష్కృత ఎంపీ శశికళ పుష్ప

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత సంతకాన్ని పార్టీలోని కొందరు ఫోర్జరీ చేసే అవకాశం ఉందని అన్నాడీఎంకే బహిష్కృత నేత, రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్ప ఆరోపించారు. ఈ మేరకు ఆమె ఏకంగా రాష్ట్ర ఇన్చార్జ్ గవర్నర్ సీహెచ్

Webdunia
సోమవారం, 10 అక్టోబరు 2016 (12:53 IST)
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత సంతకాన్ని పార్టీలోని కొందరు ఫోర్జరీ చేసే అవకాశం ఉందని అన్నాడీఎంకే బహిష్కృత నేత, రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్ప ఆరోపించారు. ఈ మేరకు ఆమె ఏకంగా రాష్ట్ర ఇన్చార్జ్ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావుకు కూడా ఓ లేఖ రాశారు. 
 
ప్రస్తుతం అనారోగ్యం కారణంగా జయలలిత చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయంతెల్సిందే. దీన్ని అవకాశం తీసుకుని ముఖ్యమంత్రి జయ సంతకాన్ని పార్టీలోని కొందరు ఫోర్జరీ చేసే అవకాశాలు ఉన్నాయని ఆమె తన లేఖలో పేర్కొన్నారు. దీనికి సంబంధించి సరైన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. 
 
శశికళ లేఖ నేపథ్యంలో, తాత్కాలిక ముఖ్యమంత్రిని నియమించాలనే వాదనకు మరింత బలం చేకూరినట్టయింది. అంతేకాదు, జయలలితకు ఏమీ తెలియని స్థితిలో తెరవెనుక ఏదైనా జరుగుతోందా? అనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. మరోవైపు, ఫోర్జరీ డాక్యుమెంట్లకు సంబంధించి కోర్టు కేసును శశికళ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్పిరిట్ కోసం పలు జాగ్రతలు తీసుకుంటున్న సందీప్ రెడ్డి వంగా

ఛావా తెలుగు ట్రైలర్ ట్రెండింగ్ లోకి వచ్చింది

అనంతిక సనీల్‌కుమార్‌ 8 వసంతాలు లవ్ మెలోడీ సాంగ్ రిలీజ్

దసరా సినిమాలో నాని కాకుండా మరొక పాత్రకు నన్ను అడిగారు : జీవీ ప్రకాష్

పెళ్లి కాని ప్రసాద్ టీజర్ చూసి ఎంజాయ్ చేసిన రెబల్ స్టార్ ప్రభాస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి తింటే...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments