Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలిత సంతకాన్ని పార్టీ నేతలు ఫోర్జరీ చేసే ఛాన్స్ : బహిష్కృత ఎంపీ శశికళ పుష్ప

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత సంతకాన్ని పార్టీలోని కొందరు ఫోర్జరీ చేసే అవకాశం ఉందని అన్నాడీఎంకే బహిష్కృత నేత, రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్ప ఆరోపించారు. ఈ మేరకు ఆమె ఏకంగా రాష్ట్ర ఇన్చార్జ్ గవర్నర్ సీహెచ్

Webdunia
సోమవారం, 10 అక్టోబరు 2016 (12:53 IST)
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత సంతకాన్ని పార్టీలోని కొందరు ఫోర్జరీ చేసే అవకాశం ఉందని అన్నాడీఎంకే బహిష్కృత నేత, రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్ప ఆరోపించారు. ఈ మేరకు ఆమె ఏకంగా రాష్ట్ర ఇన్చార్జ్ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావుకు కూడా ఓ లేఖ రాశారు. 
 
ప్రస్తుతం అనారోగ్యం కారణంగా జయలలిత చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయంతెల్సిందే. దీన్ని అవకాశం తీసుకుని ముఖ్యమంత్రి జయ సంతకాన్ని పార్టీలోని కొందరు ఫోర్జరీ చేసే అవకాశాలు ఉన్నాయని ఆమె తన లేఖలో పేర్కొన్నారు. దీనికి సంబంధించి సరైన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. 
 
శశికళ లేఖ నేపథ్యంలో, తాత్కాలిక ముఖ్యమంత్రిని నియమించాలనే వాదనకు మరింత బలం చేకూరినట్టయింది. అంతేకాదు, జయలలితకు ఏమీ తెలియని స్థితిలో తెరవెనుక ఏదైనా జరుగుతోందా? అనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. మరోవైపు, ఫోర్జరీ డాక్యుమెంట్లకు సంబంధించి కోర్టు కేసును శశికళ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments