Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌కు అమెరికా హెచ్చరిక : రష్యా నుంచి దిగుమతి చేసుకున్నారో...

Webdunia
మంగళవారం, 5 జనవరి 2021 (11:30 IST)
భారత్‌కు అమెరికా గట్టివార్నింగ్ ఇచ్చింది. రష్యా నుంచి ఎలాంటి ఆయుధాలను కొనుగోలు చేయరాదని వార్నింగ్ చేసింది. తమ హెచ్చరికలను ఉల్లంఘిస్తే మాత్రం ఆంక్షలు తప్పవని హెచ్చరించింది. 
 
కాగా, రష్యా - భారత్ దేశాల మధ్య ఏర్పడిన రక్షణ ఒప్పందాల్లో భాగంగా రూ.వందల కోట్ల విలువైన ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను కొనుగోలు చేయాలని భారత్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇండియాకు అమెరికా రూపంలో అడ్డంకులు తగులుతున్నాయి. 
 
ఈ అత్యాధునిక మిసైల్ సిస్టమ్‌ను రష్యా నుంచి కొనేందుకు గతంలోనే ఇండియా డీల్ కుదుర్చుకోగా, తాజాగా విడుదలైన యూఎస్ కాంగ్రెస్ రిపోర్టు, ఇండియా ఆయుధాలు కొనుగోలు చేస్తే, ఆంక్షలు విధిస్తామని హెచ్చరించింది. 
 
యూఎస్ కాంగ్రెస్ ఆధ్వర్యంలోని సీఆర్ఎస్ (కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్) తన తాజా నివేదికలో భారత్ తన రక్షణ విధానాన్ని మార్చుకోవాలని, సంస్కరణలు తీసుకు రావాలని సూచించింది.
 
మరింత సాంకేతికతను అందుకోవాలన్న ప్రయత్నాలు కూడదని, రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిధిని మరింతగా పెంచాలని, రక్షణ విధానాన్ని మార్చుకోవాలని సూచించింది. 
 
"రష్యా తయారు చేసుకున్న ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కు మేము వ్యతిరేకం. వీటిని ఇండియా కొనుగోలు చేస్తే, ఆంక్షలు విధించే అవకాశం ఉంది. అమెరికా ఆంక్షల చట్టానికి ఇండియా - రష్యా డీల్ వ్యతిరేకంగా ఉండటమే ఇందుకు కారణం" అని సీఆర్ఎస్ పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharwanand: తమన్నా ని హీరోయిన్ అని పిలవడం ఇష్టం లేదు : శర్వానంద్

Maheshbabu: వెకేషన్ నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చిన మహేష్ బాబు

ఎంతో మందితో కలిసి పని చేసినా.. కొంతమందితోనే ప్రత్యేక అనుబంధం : తమన్నా

Nani: వైలెన్స్ సినిమాలున్న దేశాల్లో క్రైమ్ రేట్ తక్కువ, కానీ ఇక్కడ మన బుద్ధి సరిగ్గా లేదు : నాని

Dhanush: శేఖర్ కమ్ముల కుబేర లో ధనుష్ మాస్ సాంగ్ డేట్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

తర్వాతి కథనం
Show comments