Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధానమంత్రి నరేంద్ర మోడికి రష్యా అత్యున్నత పౌర గౌరవం (Video)

ఐవీఆర్
మంగళవారం, 9 జులై 2024 (22:22 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడికి మంగళవారం నాడు క్రెమ్లిన్‌లో రష్యా అత్యున్నత పౌర గౌరవమైన ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్‌ను ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ అందించారు. ద్వైపాక్షిక చర్చల సందర్భంగా, ప్రధాని మోదీ వ్లాదిమిర్ రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మాట్లాడుతూ, ఉక్రెయిన్ వివాదానికి యుద్దభూమిలో పరిష్కారం సాధ్యం కాదని అన్నారు.
 
బాంబులు, తుపాకులు, బుల్లెట్ల మధ్య శాంతి చర్చలు విజయవంతం కావని చెప్పారు. కీవ్‌లోని పిల్లల ఆసుపత్రిపై దాడిపై మాట్లాడుతూ... అమాయక బాలలు మరణించడం చాలా బాధాకరమని ఆయన అన్నారు. క్రెమ్లిన్‌లో పుతిన్‌తో జరిగిన సమావేశంలో ఆయన టెలివిజన్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు. రెండు రోజుల రష్యా పర్యటనకై మోడి రష్యా వెళ్లారు. రష్యా లోని భారతీయ కమ్యూనిటీని ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు, 'మోడీ-మోడీ' నినాదాల మధ్య రష్యాను 'భారతదేశం యొక్క ఆల్-వెదర్ ఫ్రెండ్' అని చెప్పారు.
 
స్నేహితుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ద్వైపాక్షిక సహకారం అన్ని అంశాలను సమీక్షించడానికి తాను ఎదురుచూస్తున్నానని ప్రధాని మోడి చెప్పారు. శాంతియుత, సుస్థిరమైన ప్రాంతం కోసం ఇద్దరు నాయకులూ సహాయక పాత్ర పోషించాలని కోరుతారని ఆయన అన్నారు. ఫిబ్రవరి 2022లో మాస్కో ఉక్రెయిన్‌పై దాడి చేసిన తర్వాత మోదీ రష్యాలో పర్యటించడం ఇదే తొలిసారి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments