Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రేకింగ్.. మానవుల్లో తొలి బర్డ్ ఫ్లూ కేసు.. ఉపద్రవం ముంచుకొస్తుందా?

Webdunia
శనివారం, 20 ఫిబ్రవరి 2021 (21:45 IST)
బ్రేకింగ్ న్యూస్ ఇదే. పక్షుల్లో బర్డ్ ఫ్లూ కేసులు నమోదు కావడం తెలిసిందే. ఇటీవల భారత్‌లోనూ బర్డ్‌ఫ్లూ కల్లోలం రేపింది. దేశంలోని చాలా రాష్ట్రాలు బర్డ్‌ఫ్లూ దెబ్బకు వణికిపోయాయి. అయితే, కట్టుదిట్టమైన చర్యల కారణంగా ఆ తర్వాత అది నెమ్మదించింది. 
 
తాజాగా మానవుల్లో తొలి బర్డ్ ఫ్లూ కేసును రష్యాలో గుర్తించారు. దీంతో కరోనా విలయం నుంచి ప్రపంచం తేరుకునే ముందే ఉపద్రవం ముంచుకొస్తున్నట్లు కనిపిస్తోంది. ఇన్‌ఫ్లూయెంజా-ఎ వైరస్‌లోని H5N8 స్ట్రెయిన్‌ను వెక్టార్ రీసెర్చ్ సెంటర్ శాస్త్రవేత్తలు మానవుల్లో గుర్తించారు. 
 
బర్డ్‌ఫ్లూకు కారణమయ్యేది ఇదేనని.. మానవుల్లో తొలి బర్డ్‌ఫ్లూ కేసును వీరు గుర్తించారు. ఎవియన్ ఇన్‌ఫ్లూయెంజా ఎ వైరస్ స్ట్రెయిన్ H5N8 హ్యూమన్ ఇన్‌ఫెక్షన్‌కు సంబంధించిన తొలి కేసు ఇదని వినియోగదారుల హక్కుల రక్షణ వాచ్‌డాగ్ రెస్పోట్రెబ్నాడ్జర్ హెడ్ అన్నా పొపోవా తెలిపారు.
 
పక్షుల్లో చాలా ప్రమాదకరమైన వ్యాధి అయిన ఇది ఇప్పటి వరకు మానవుల్లో కనిపించిన దాఖలాల్లేవు. రష్యా దక్షిణ ప్రాంతంలో డిసెంబరులో బర్డ్ ఫ్లూ వెలుగు చూడగా, ఓ పౌల్ట్రీ ఫామ్‌లోని ఏడుగురు ఉద్యోగుల్లో ఈ ఫ్లూ జాతి జన్యు పదార్థాన్ని శాస్త్రవేత్తలు వేరు చేశారు. కొద్దిపాటి క్లినికల్ లక్షణాలు తప్ప ప్రస్తుతం వారంతా ఆరోగ్యంగానే ఉన్నారని పొపోవా తెలిపారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments