Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉక్రెయిన్‌లోకి చొరబడిన రష్యా... ఎయిర్‌బేస్‌లు ధ్వంసం

Webdunia
గురువారం, 24 ఫిబ్రవరి 2022 (13:03 IST)
అందరూ ఊహించినట్టుగానే ఉక్రెయిన్ - రష్యా దేశాల మధ్య యుద్ధం మొదలైంది. ఉక్రెయిన్‌లోని వేర్పాటువాద ప్రాంతాలను స్వతంత్ర రాష్ట్రాలుగా ప్రకటించిన రష్యా.. ఆ ప్రాంతాల్లోకి తొలుత ప్రవేశించింది. అక్కడ నుంచి ఉక్రెయిన్‌ దేశంలోకి చొరబడి, భీకర దాడులకు దిగింది. ఇందులోభాగంగా, ఉక్రెయిన్‌లోని ఎయిర్‌బేస్‌లతో పాటు గగనతల రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేసింది. ఈ విషయాన్ని రష్యా అధికారికంగా ప్రకటించింది. దీంతో ఉక్రెయిన్‌లో ప్రజలు ప్రాణాలను గుప్పెట పెట్టుకుని జీవిస్తున్నారు. 
 
యుద్ధం ఆరంభంకావడంతో ఉక్రెయిన్ ప్రజల్లో తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. కొందరు సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకుంటున్నారు. మరోవైపు, ఉక్రెయిన్ సైన్యం ఏమాత్రం బెదరకుండా తమ దేశాన్ని, తమ భూభాగాన్ని రక్షించుకునేందుకు తన శక్తిమేరకు పోరాడుతుంది. ఇందులోభాగంగా రష్యాకు చెందిన అనేక యుద్ధ విమానాలను ధ్వసం చేసింది. 
 
మరోవైపు, ఉక్రెయిన్‌లోని ఎయిర్ బేస్‌లను ధ్వంసం చేసినట్టు రష్యా ప్రకటించడంతో ఉక్రెయిన్‌లోని విదేశీ పౌరులు, ప్రతినిధులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఇప్పటికే ఎయిర్ పోర్టులను కూడా ఉక్రెయిన్ మూసివేసింది. దీంతో ఆ దేశంలోని విదేశీయులు తమ దేశాలకు వెళ్లలేక అక్కడే  చిక్కుకుని పోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని.. ప్రతి రాత్రి బయటకు వెళ్లడం..?

డ్రగ్స్‌కు వ్యతిరేకంగా రూపొందిన ఫైటర్ శివ టీజర్ ఆవిష్కరించిన అశ్వనీదత్

ధర్మశాల వంటి ఒరిజనల్ లొకేషన్ లో పరదా చిత్రించాం : డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల

Madhu Shalini: మా అమ్మానాన్న లవ్ స్టోరీ కన్యాకుమారిలానే వుంటుంది : మధు షాలిని

Priyanka Arul : ఓజీ చిత్రం నుండి ప్రియాంక అరుల్ మోహన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

తర్వాతి కథనం
Show comments