Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉక్రెయిన్‌లోకి చొరబడిన రష్యా... ఎయిర్‌బేస్‌లు ధ్వంసం

Webdunia
గురువారం, 24 ఫిబ్రవరి 2022 (13:03 IST)
అందరూ ఊహించినట్టుగానే ఉక్రెయిన్ - రష్యా దేశాల మధ్య యుద్ధం మొదలైంది. ఉక్రెయిన్‌లోని వేర్పాటువాద ప్రాంతాలను స్వతంత్ర రాష్ట్రాలుగా ప్రకటించిన రష్యా.. ఆ ప్రాంతాల్లోకి తొలుత ప్రవేశించింది. అక్కడ నుంచి ఉక్రెయిన్‌ దేశంలోకి చొరబడి, భీకర దాడులకు దిగింది. ఇందులోభాగంగా, ఉక్రెయిన్‌లోని ఎయిర్‌బేస్‌లతో పాటు గగనతల రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేసింది. ఈ విషయాన్ని రష్యా అధికారికంగా ప్రకటించింది. దీంతో ఉక్రెయిన్‌లో ప్రజలు ప్రాణాలను గుప్పెట పెట్టుకుని జీవిస్తున్నారు. 
 
యుద్ధం ఆరంభంకావడంతో ఉక్రెయిన్ ప్రజల్లో తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. కొందరు సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకుంటున్నారు. మరోవైపు, ఉక్రెయిన్ సైన్యం ఏమాత్రం బెదరకుండా తమ దేశాన్ని, తమ భూభాగాన్ని రక్షించుకునేందుకు తన శక్తిమేరకు పోరాడుతుంది. ఇందులోభాగంగా రష్యాకు చెందిన అనేక యుద్ధ విమానాలను ధ్వసం చేసింది. 
 
మరోవైపు, ఉక్రెయిన్‌లోని ఎయిర్ బేస్‌లను ధ్వంసం చేసినట్టు రష్యా ప్రకటించడంతో ఉక్రెయిన్‌లోని విదేశీ పౌరులు, ప్రతినిధులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఇప్పటికే ఎయిర్ పోర్టులను కూడా ఉక్రెయిన్ మూసివేసింది. దీంతో ఆ దేశంలోని విదేశీయులు తమ దేశాలకు వెళ్లలేక అక్కడే  చిక్కుకుని పోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments