అమెరికా వ్యాపారులకు కాసుల వర్షం కురిపిస్తున్న భారత్ నిర్ణయం

Webdunia
శుక్రవారం, 28 జులై 2023 (10:32 IST)
భారత ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం అమెరికా వ్యాపారులకు కాసుల వర్షం కురిపిస్తుంది. నాన్ బాస్మతీ బియ్యం ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించింది. ఇది బియ్యం వ్యాపారుల పాలిట వరంగా మారింది. ముఖ్యంగా, అమెరికాలో ఈ బియ్యం కొరత ఏర్పడటంతో డిమాండ్ కూడా ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇది అమెరికా వ్యాపారులపై కాసుల వర్షం కురుస్తోంది. 
 
ఇప్పటికే బియ్యం బస్తాలను జనాలు పోటీ పడి కొనుగోలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో పెద్ద పెద్ద కంపెనీలన్నీ బియ్యం ధరలను రెట్టింపు చేశాయి. భవిష్యత్తులో ఇతర రకాల బియ్యంపై నిషేధం విధించొచ్చన్న ఊహగానాల నడుమ రెస్టారెంట్ల యాజమాన్యాలు ఇప్పటి నుంచే బాస్మతీ బియ్యం కొనుగోళ్లు పెంచినట్టు సమాచారం.
 
ఉక్రెయిన్ - రష్యా యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆహారధాన్యాల కొరత తీవ్రమవుతోంది. దీనికితోడు భారత్ నిర్ణయం పరిస్థితులను మరింత దిగజార్చే అవకాశం ఉందన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. భారత్ తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ సూచించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiranjeevi: క్లైమాక్స్ ఫైట్ షూటింగ్ లో మన శంకరవరప్రసాద్ గారు

Prashanth Varma: నా పై ఆరోపణలు అబద్దం, ప్రతీకారం గా జరుగుతున్నాయి: ప్రశాంత్ వర్మ

Suma: దంపతుల జీవితంలో సుమ కనకాల ఎంట్రీ తో ఏమయిందనే కథతో ప్రేమంటే

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments