Webdunia - Bharat's app for daily news and videos

Install App

నలుగురు భారతీయులను తొలగించి ఒక అమెరికన్‌ను ఉద్యోగమిస్తున్న ఐటీ కంపెనీలు

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దెబ్బకు అమెరికాలోని ఐటి కంపెనీలు వణికిపోతున్నాయి. దేశాధ్యక్షుడి హోదాలో ఆయన జారీ చేసిన ఉత్తర్వులను అమలు చేసేందుకు ముందుకు వస్తున్నాయి.

Webdunia
బుధవారం, 10 మే 2017 (11:37 IST)
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దెబ్బకు అమెరికాలోని ఐటి కంపెనీలు వణికిపోతున్నాయి. దేశాధ్యక్షుడి హోదాలో ఆయన జారీ చేసిన ఉత్తర్వులను అమలు చేసేందుకు ముందుకు వస్తున్నాయి. ఇందుకోసం ఒక్క అమెరికా పౌరుడికి ఉద్యోగం ఇచ్చేందుకు నలుగురు భారతీయ ఉద్యోగులను తొలగించేందుకు ఏమాత్రం వెనుకాడటం లేదు. 
 
డోనాల్డ్ ట్రంప్ మాట వినకుంటే అమెరికా నుంచి ఆర్డర్లు తెచ్చుకునే సంస్థలకు, ఇచ్చిన సంస్థలకు బార్డర్ ట్యాక్స్ పేరుతో భారీ జరిమానాలు చెల్లించాల్సి ఉండటంతో పాటు అమెరికాలో ఉన్న తమ సంస్థలు, అందులోని ఉద్యోగులను ఇబ్బందులు పెడతారని ఐటీ పరిశ్రమల యజమానులు ఆందోళన చెందుతున్నారు. ఈనేపథ్యంలో తలనొప్పులు ఎందుకని భావించిన సంస్థలు భారతీయుల కంటే నలుగురు భారతీయులను తొలగించైనా సరే ఒక అమెరికన్‌కు ఉద్యోగం ఇవ్వాలని భావిస్తున్నాయి. దీంతో ప్రస్తుతం భారత్ ఐటీ రంగం తీవ్ర ఒడిదుడుకుల్లో ఉంది. 
 
భారతీయ ఉద్యోగులను తొలగించే కంపెనీల జాబితాలో కాగ్నిజెంట్ ముందు వరుసలో ఉంది. బలవంతపు వీఆర్ఎస్ ఇచ్చి ఉద్యోగులను ఇంటికి పంపే చర్యలు చేపట్టింది. అలాగే, విప్రో, ఇన్ఫోసిస్, ఇతర కంపెనీలు కూడా ఇదేబాటలో నడిచేందుకు సిద్ధమయ్యాయి. దీనికితోడు ఐటీ పరిశ్రమలో ఆటోమేషన్ విధానం కూడా ఉద్యోగులకు ప్రతికూలంగా మారింది. మానవవనరుల స్థానంలో రోబోలు సగం పనిని పూర్తి చేసేస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత ఐటి కంపెనీలు భారీ సంఖ్యలో ఉద్యోగాల కోతకు సిద్ధమవుతున్నాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం